ఎక్స్ పో సిటీ దుబాయ్ చూసేందుకు వన్ డే పాస్ ను ప్రవేశ పెట్టిన ప్రభుత్వం
- September 27, 2022
దుబాయ్ : దుబాయ్ లోని ప్రఖ్యాత ఎక్స్ పో సిటీ దుబాయ్ ప్రదర్శనను చూసేందుకు నిర్వాహకులు ప్రత్యేక ఆఫర్ ను ప్రకటించారు. ఎక్కువ మంది ఈ ఎక్స్ పో ను విజిట్ చేసేందుకు వీలుగా వారికి తక్కువ ధరకే వన్ డే పాస్ ను అందుబాటులోకి తెచ్చారు. 120 దిర్హామ్ లు చెల్లించి ఈ పాస్ తీసుకోవచ్చు. అక్టోబర్ 1 నుంచి ఇది అందుబాటులో ఉంటుంది. ఆన్ లైన్ ద్వారా ఈ పాస్ తీసుకోవచ్చు. ఈ పాస్ ఉన్న వారు విజన్ పెవిలియన్, ఉమెన్స్ పెవిలియన్, టెర్రా - ది సస్టైనబిలిటీ పెవిలియన్, అలీఫ్ - ది మొబిలిటీ పెవిలియన్లను చూడొచ్చు. 12 ఏళ్ల లోపు పిల్లలకు మాత్రం ఎక్స్ పో కు ఉచితంగా ప్రవేశం కల్పించారు. విజన్ పెవిలియన్ లో UAE వైస్ ప్రెసిడెంట్, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ జీవిత విశేషాలు, ఆయన నాయకత్వం సామర్థ్యానికి సంబంధించి అంశాలతో పాటు ఆయన బాల్య విశేషాలు ఉంటాయి. ఉమెన్ పెవిలియన్ లో మహిళల అభివృద్ధి సమానత్వానికి సంబంధించిన విశేషాలు పొందుపరిచారు. ఎక్స్ పో సిటీ దుబాయ్ నిర్వాహకులు, స్కూల్ స్టూడెంట్స్, ఇతర ప్రొగ్రామింగ్ విద్యా సంస్థలు తక్కువ ధరలకే ఎక్స్ పో చూసేందుకు అనుమతి ఇస్తున్నారు. ఇందుకు సంబంధించిన సమాచారం కోసం www.schools.expocitydubai.comలో చూడవచ్చు.
తాజా వార్తలు
- సైబర్ నేరాల నియంత్రణ పై ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి
- కువైట్లో పశువుల షెడ్డులో ఘర్షణ.. ముగ్గురికి గాయాలు, ముగ్గురు అరెస్ట్
- వెనెజువెలాలో భూకంప భీభత్సం..
- భారత క్రికెట్ చరిత్రను మార్చిన రోజు
- క్రెడిట్ కార్డు యూజర్లకు RBI గుడ్ న్యూస్
- సమ్మర్ లో ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్లెక్సిబుల్ టైమింగ్స్: దుబాయ్
- జెడ్డాలో 12 లైసెన్సు లేని వాటర్ బాట్లింగ్ ప్లాంట్లు సీజ్..!!
- యూఏఈ లాటరీ: Dh100,000 బహుమతి గెలిచిన ముగ్గురు విజేతలు..!!
- ముగిసిన సంక్షోభం..భారీగా ఖర్చు పెడుతున్న కువైట్ కన్జుమర్స్..!!
- ఐక్యరాజ్యసమితికి పురోగతి నివేదిక సమర్పించిన బహ్రెయిన్..!!







