ఎక్స్ పో సిటీ దుబాయ్ చూసేందుకు వన్ డే పాస్ ను ప్రవేశ పెట్టిన ప్రభుత్వం
- September 27, 2022
దుబాయ్ : దుబాయ్ లోని ప్రఖ్యాత ఎక్స్ పో సిటీ దుబాయ్ ప్రదర్శనను చూసేందుకు నిర్వాహకులు ప్రత్యేక ఆఫర్ ను ప్రకటించారు. ఎక్కువ మంది ఈ ఎక్స్ పో ను విజిట్ చేసేందుకు వీలుగా వారికి తక్కువ ధరకే వన్ డే పాస్ ను అందుబాటులోకి తెచ్చారు. 120 దిర్హామ్ లు చెల్లించి ఈ పాస్ తీసుకోవచ్చు. అక్టోబర్ 1 నుంచి ఇది అందుబాటులో ఉంటుంది. ఆన్ లైన్ ద్వారా ఈ పాస్ తీసుకోవచ్చు. ఈ పాస్ ఉన్న వారు విజన్ పెవిలియన్, ఉమెన్స్ పెవిలియన్, టెర్రా - ది సస్టైనబిలిటీ పెవిలియన్, అలీఫ్ - ది మొబిలిటీ పెవిలియన్లను చూడొచ్చు. 12 ఏళ్ల లోపు పిల్లలకు మాత్రం ఎక్స్ పో కు ఉచితంగా ప్రవేశం కల్పించారు. విజన్ పెవిలియన్ లో UAE వైస్ ప్రెసిడెంట్, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ జీవిత విశేషాలు, ఆయన నాయకత్వం సామర్థ్యానికి సంబంధించి అంశాలతో పాటు ఆయన బాల్య విశేషాలు ఉంటాయి. ఉమెన్ పెవిలియన్ లో మహిళల అభివృద్ధి సమానత్వానికి సంబంధించిన విశేషాలు పొందుపరిచారు. ఎక్స్ పో సిటీ దుబాయ్ నిర్వాహకులు, స్కూల్ స్టూడెంట్స్, ఇతర ప్రొగ్రామింగ్ విద్యా సంస్థలు తక్కువ ధరలకే ఎక్స్ పో చూసేందుకు అనుమతి ఇస్తున్నారు. ఇందుకు సంబంధించిన సమాచారం కోసం www.schools.expocitydubai.comలో చూడవచ్చు.
తాజా వార్తలు
- ఫుజైరా ఆయిల్ జోన్లో అగ్నిప్రమాదం, కూలిన డ్రోన్ శకలాలు: అదుపులోకి తెచ్చిన అధికారులు!
- కోమ్ నుండి టెహ్రాన్కు సురక్షితంగా చేరుకున్న భారతీయ విద్యార్థులు
- ఒమాన్లోని డుక్మ్ పోర్ట్ పై డ్రోన్ దాడి
- పాకిస్తాన్లోని అమెరికా రాయబార కార్యాలయం వీసా అపాయింట్మెంట్ రద్దు
- CBSE అలర్ట్: గల్ఫ్ దేశాల్లో మార్చి 5, 6 తేదీల్లో జరగాల్సిన బోర్డు పరీక్షలు కూడా వాయిదా!
- అన్ని శాఖల్లో ఎఐ వినియోగం పై సీఎం చంద్రబాబు సమీక్ష
- దుబాయ్ నుంచి భారత్కు సురక్షితంగా చేరుకున్న పీవీ సింధు!
- 15 మిడిలీస్టు దేశాలను వీడండి..అమెరికన్లకు ఎమర్జెన్సీ అలెర్ట్ జారీ..!!
- గంటన్నరలో హైదరాబాద్ నుండి అమరావతికి !!
- అన్ని ఎంట్రీ వీసాలను ఒక నెల పాటు పొడిగించిన ఖతార్..!!









