కరోనా కేసులు తగ్గటంతో నిబంధనలు సడలించి యూఏఈ
- September 27, 2022
యూఏఈ : కరోనా కేసులు భారీగా తగ్గటంతో నిబంధనలు సడలిస్తున్నట్లు యూఏఈ ప్రకటించింది. గత మూడు నెలలుగా ఒక్క కరోనా మరణం కూడా ఇక్కడ జరగలేదు. పైగా కరోనా పాజిటివ్ కేసులు భారీగా తగ్గాయి. దీంతో మాస్క్ నిబంధనను సడలించారు. విమానాల్లో, స్కూల్స్ లో మాస్క్ అవసరం లేదని ప్రకటించారు. ఐతే విమాన సంస్థలు మాస్క్ నిబంధన తప్పనిసరిగా అమలు చేయాలనుకుంటే వారికే ఆప్షన్ ఇచ్చారు. రేపటి నుంచి నిబంధనల సడలింపు అమల్లోకి వస్తుంది. ఐతే హాస్పిటల్స్, మసీదులు, పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ లో మాత్రం మాస్క్ తప్పనిసరిగా ధరించాలనే నిబంధన పెట్టారు. కోవిడ్ రోగులు, కరోనా అనుమానిత లక్షణాలు ఉన్న వారు, ఫుడ్ సర్వీస్ చేసే డెలివరీ బాయ్స్ కచ్చితంగా మాస్క్ లు ధరించాలని ప్రకటించారు. ప్రస్తుతం యూఏఈ లో రోజువారీ కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. రోజుకు 300 లోపే కొత్త కేసులు రావటంతో నిబంధనలు సడలించారు.
తాజా వార్తలు
- డెకాయ్ ఆపరేషన్లతో పోలీసుల బాగోతం బట్టబయలు: సీపీ సజ్జనార్
- హోర్ముజ్ జలసంధి పై సుంకాలు ఉండవు..అమెరికాకు తెలిపిన ఇరాన్
- సైబర్ నేరాల నియంత్రణ పై ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి
- కువైట్లో పశువుల షెడ్డులో ఘర్షణ.. ముగ్గురికి గాయాలు, ముగ్గురు అరెస్ట్
- వెనెజువెలాలో భూకంప భీభత్సం..
- భారత క్రికెట్ చరిత్రను మార్చిన రోజు
- క్రెడిట్ కార్డు యూజర్లకు RBI గుడ్ న్యూస్
- సమ్మర్ లో ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్లెక్సిబుల్ టైమింగ్స్: దుబాయ్
- జెడ్డాలో 12 లైసెన్సు లేని వాటర్ బాట్లింగ్ ప్లాంట్లు సీజ్..!!
- యూఏఈ లాటరీ: Dh100,000 బహుమతి గెలిచిన ముగ్గురు విజేతలు..!!







