కరోనా కేసులు తగ్గటంతో నిబంధనలు సడలించి యూఏఈ
- September 27, 2022
యూఏఈ : కరోనా కేసులు భారీగా తగ్గటంతో నిబంధనలు సడలిస్తున్నట్లు యూఏఈ ప్రకటించింది. గత మూడు నెలలుగా ఒక్క కరోనా మరణం కూడా ఇక్కడ జరగలేదు. పైగా కరోనా పాజిటివ్ కేసులు భారీగా తగ్గాయి. దీంతో మాస్క్ నిబంధనను సడలించారు. విమానాల్లో, స్కూల్స్ లో మాస్క్ అవసరం లేదని ప్రకటించారు. ఐతే విమాన సంస్థలు మాస్క్ నిబంధన తప్పనిసరిగా అమలు చేయాలనుకుంటే వారికే ఆప్షన్ ఇచ్చారు. రేపటి నుంచి నిబంధనల సడలింపు అమల్లోకి వస్తుంది. ఐతే హాస్పిటల్స్, మసీదులు, పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ లో మాత్రం మాస్క్ తప్పనిసరిగా ధరించాలనే నిబంధన పెట్టారు. కోవిడ్ రోగులు, కరోనా అనుమానిత లక్షణాలు ఉన్న వారు, ఫుడ్ సర్వీస్ చేసే డెలివరీ బాయ్స్ కచ్చితంగా మాస్క్ లు ధరించాలని ప్రకటించారు. ప్రస్తుతం యూఏఈ లో రోజువారీ కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. రోజుకు 300 లోపే కొత్త కేసులు రావటంతో నిబంధనలు సడలించారు.
తాజా వార్తలు
- యూఏఈలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల సేవల్లో అంతరాయాలు..!!
- స్ట్రాటజిక్ మెడిసిన్స్, మెడికల్ సప్లై తనిఖీ చేసిన కువైట్ పీఎం..!!
- అనేక ఫ్లైట్స్ రద్దు చేసిన ఒమన్ ఎయిర్..!!
- పౌరులు, నివాసితులు, విజిటర్స్ భద్రతకు సౌదీ భరోసా..!!
- బహ్రెయిన్ లో క్యాంపింగ్ సీజన్ సస్పెండ్..!!
- ఖతార్లో అధిక సామర్థ్యంతో పనిచేస్తున్న ఫుడ్ ఫ్యాక్టరీస్..!!
- ఫుజైరా ఆయిల్ జోన్లో అగ్నిప్రమాదం, కూలిన డ్రోన్ శకలాలు: అదుపులోకి తెచ్చిన అధికారులు!
- కోమ్ నుండి టెహ్రాన్కు సురక్షితంగా చేరుకున్న భారతీయ విద్యార్థులు
- ఒమాన్లోని డుక్మ్ పోర్ట్ పై డ్రోన్ దాడి
- పాకిస్తాన్లోని అమెరికా రాయబార కార్యాలయం వీసా అపాయింట్మెంట్ రద్దు









