రోడ్డు ప్రమాదంలో..’తానా’ డైరెక్టర్ భార్య, ఇద్దరు కుమార్తెలు మృతి
- September 27, 2022
అమెరికా: తానా బోర్డు డైరెక్టర్ కొడాలి నాగేంద్ర శ్రీనివాస్ కుటుంబంలో విషాద ఘటన చోటుచేసుకుంది.అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్య, ఇద్దరు కూతుళ్లు ప్రాణాలు కోల్పోయారు.పెద్ద కూతురిని తీసుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తానా బోర్డు డైరెక్టర్ డాక్టర్ కొడాలి నాగేంద్ర శ్రీనివాస్ భార్య, ఇద్దరు కుమార్తెలు మృతి చెందారు. డాక్టర్ శ్రీనివాస్ హ్యూస్టన్లో నివాసం ఉంటున్నారు. ఆయన భార్య వాణి ఐటీ ఉద్యోగి. ఇద్దరు కుమార్తెలలో పెద్ద కూతురు వైద్య విద్యను అభ్యసిస్తోంది. చిన్న కూతురు 11వ తరగతి చదువుతోంది. దసరాకి పెద్ద కూతురుని ఇంటికి తీసుకురావడానికి వాణి, ఆమె చిన్న కూతురు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వారు ప్రయాణిస్తున్న లెక్సస్ కారును చెవీ పికప్ ట్రక్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో శ్రీనివాస్ తనకుటుంబాన్ని కోల్పోయారు. ఈ ఘటనపై తానా సభ్యులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కొడాలి నాగేంద్ర శ్రీనివాస్ కృష్ణా జిల్లా కురుమద్దాలిలో పుట్టి గుంటూరు మెడికల్ కాలేజీలో మెడిసిన్ చదివారు. తర్వాత 1995లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు అమెరికా వెళ్లారు. అమెరికాలోని హ్యూస్టన్ కుటుంబంతో పీడియాట్రిక్ కార్డియోవాస్కులర్ అనస్థీషియాలజిస్ట్గా స్థిరపడ్డారు. 2017 నుండి, తానా బోర్డు మెంబర్గా వ్యవహరిస్తున్నారు.
తాజా వార్తలు
- పిల్లల సోషల్ మీడియాపై ఆంక్షలు.. యూఏఈ స్కూళ్లో మారనున్న పరిస్థితులు..!!
- సౌదీలో స్కూల్ రవాణా సేవలపై విద్యాశాఖ కీలక మార్గదర్శకాలు..!!
- కటారా ఆహ్వానం.. వీకెండ్ లో కల్చర్, వినోదంతో సందడి..!!
- మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- గాయపడ్డ పౌరుడికి ఎయిర్ అంబులెన్స్ సేవలు..!!
- కువైట్లో సమగ్ర డ్రైనేజీ వ్యవస్థ.. ఫ్లడ్ సమస్యలకు చెక్..!!
- దుబాయ్ టయోటా బిల్డింగ్లో అక్రమ పార్టిషన్లు..జరిమానాలు చెల్లించిన తర్వాతే ఖాళీ చేయాలి
- సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దు
- డాలస్లో ఘనంగా కవికులాలంకార వేటూరి సాహితీ మహోత్సవం
- యూఏఈలో ఉద్యోగికి పని ప్రదేశంలో గాయమైతే పరిహారం ఎలా? పూర్తి వివరాలు







