ఒక్కో పాఠశాల అవసరాలకు 4,000 దీనార్లు: కువైట్ విద్యాశాఖ
- September 27, 2022
కువైట్: కొత్త విద్యా సంవత్సరానికి సంబంధించిన మొదటి బ్యాచ్ స్కూల్ ఫండ్ విడుదలైందని, సంబంధిత ప్రభుత్వ పాఠశాలల ఖాతాల్లో వాటిని జమ చేసినట్లు విద్యా మంత్రిత్వ శాఖలోని ఆర్థిక వ్యవహారాల అసిస్టెంట్ అండర్ సెక్రటరీ యూసఫ్ అల్-నజ్జర్ తెలిపారు. ఒక్కో పాఠశాల అవసరాలకు 3,500- 4,000 దీనార్ల మధ్య అందుతాయన్నారు. 75 శాతం కేటాయింపులు పూర్తి చేసినట్లు.. రెండవ దశ చెల్లింపులు (25 శాతం)లను వచ్చే ఏప్రిల్లో పంపిణీ చేయనున్నట్లు అల్-నజ్జర్ వివరించారు. ఈ ఫండ్ పాఠశాల హెడ్ మాస్టర్ ఆధీనంలో ఉంటందన్నారు. ఈ నిధులను స్టేషనరీ, కార్యాలయ సామాగ్రి, వాటర్ ట్యాంక్లు కడగడం, మరుగుదొడ్లు మరమ్మతులు, చిన్నపాటి నిర్వహణ పనులకు ఖర్చు చేయొచ్చన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్: మత వర్గాన్ని అవమానించేలా సోషల్ మీడియాలో పోస్టులు..60 ఏళ్ల వ్యక్తి అరెస్ట్
- స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీతో బాధపడుతున్న ఏడాది చిన్నారికి దుబాయ్ రూలర్ అండ
- సౌదీ విమానాశ్రయం, అరామ్కో కేంద్రంపై దాడులు చేశామని హూతీలు ప్రకటన
- సెప్టెంబర్ 1 నుంచి కువైట్లో విజిట్ వీసా, అబ్సెన్స్ పర్మిట్ పొడిగింపులు నిలిపివేత
- స్పెషలైజ్డ్ వింగ్స్ హెచ్ఓడీలతో డీజీపీ సి.వి.ఆనంద్
- దుబాయ్ రోబోట్యాక్సీ 40 లక్షల కిలోమీటర్లు పూర్తి.. ప్రయాణికుల సంతృప్తి 97 శాతం
- ట్రంప్ హెచ్చరికల పై ఘాటుగా స్పందించిన ఇరాన్
- బంగ్లాదేశ్ నూతన అధ్యక్షుడిగా మీర్జా ఫఖ్రూల్
- సోషల్ మీడియాలో ఎమిరాతీ మహిళలను అవమానించినందుకు UAE చర్యలు
- అల్ రమ్లీ అగ్నిప్రమాదంపై దర్యాప్తు ముమ్మరం..!!







