సౌదీలో న్యాయవాదిపై సస్పెన్షన్ వేటు
- September 27, 2022
సౌదీ: ఒక కంపెనీని అవమానించినందుకు, ఆ సంస్థ పరువు తీసినందుకు ఒక న్యాయవాదిని ఒకటిన్నర సంవత్సరాల పాటు న్యాయవాద వృత్తి నుండి దూరంగా ఉండాలని న్యాయ మంత్రిత్వ శాఖలోని న్యాయవాదుల క్రమశిక్షణా కమిటీ సస్పెండ్ చేసింది. దీంతోపాటు న్యాయవాదిపై మోపబడిన అభియోగాలకు చట్టపరమైన ప్రక్రియలు తీసుకోవాలని కూడా కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ప్రకటించింది. సదరు న్యాయవాది న్యాయ వ్యవస్థ, న్యాయవాదుల వృత్తిపరమైన ప్రవర్తనా నియమాలను ఉల్లంఘించినట్లు గుర్తించినట్లు కమిటీ తెలిపింది. అలాగే న్యాయ వ్యవస్థ, దాని కార్యనిర్వాహక నిబంధనలు, న్యాయవాదుల వృత్తిపరమైన ప్రవర్తనా నియమాలను ఉల్లంఘించిన నలుగురు న్యాయవాదులపై కమిటీ శిక్షాత్మక క్రమశిక్షణా చర్యలు తీసుకున్నట్లు న్యాయవాదుల క్రమశిక్షణా కమిటీ పేర్కొంది.
తాజా వార్తలు
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్గా బి.సుమతి బాధ్యతల స్వీకరణ
- కార్పొరేట్ ట్యాక్స్ బిల్లులో లోపాలను ఎత్తిచూపిన పార్లమెంట్ ప్యానెల్..!!
- 3 గంటల రెస్క్యూ..మహిళను రక్షించిన యూఏఈ హైకర్..!!
- 2026 Q1లో సౌదీ GDP 2.8% వృద్ధి..!!
- ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై QCAA కఠిన చర్యలు..!!
- ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచిక..ఒమన్ 7 స్థానాలు మెరుగు..!!
- కువైట్ లో జూన్ 30 వరకు కార్మికుల బదిలీలు..!!
- ఈ ఆదివారం నుంచి జజీరా ఎయిర్వేస్ పూర్తిస్థాయి సేవలు పునఃప్రారంభం
- పర్యావరణ అసమతుల్యంతో ఎండ తీవ్రత
- కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం..ఏపీలో త్వరలో మరో కొత్త పథకం..!









