పిల్లర్ను ఢీకొన్న వాహనం.. ఇద్దరు మృతి
- September 28, 2022
అబుధాబి: క్లీవ్ల్యాండ్ క్లినిక్ ప్రవేశ ద్వారం వద్ద ఉన్న కాంక్రీట్ పిల్లర్ను ఓ వాహనం బలంగా ఢీకొన్నది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగినట్లు అబుధాబి పోలీసుల ట్రాఫిక్ అండ్ పెట్రోల్స్ డైరెక్టరేట్ తెలిపింది. డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో వాహనం అదుపుతప్పి పిల్లర్ను ఢీకొట్టిందని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే రెస్క్యూ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించినట్లు.. గాయపడ్డ వ్యక్తిని ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. బాధితుల వివరాలను అధికారులు వెల్లడించలేదు. మృతుల కుటుంబాలకు అబుదాబి పోలీసులు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయపడిన వ్యక్తి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రమాదాల నివారణకు వాహనదారులు జాగ్రత్తగా వాహనాలు నడపాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పోలీసులు కోరారు.
తాజా వార్తలు
- అల్ రమ్లీ అగ్నిప్రమాదంపై దర్యాప్తు ముమ్మరం..!!
- ఖతార్లో భారీగా పెరిగిన డిజిటల్ పేమెంట్స్..!!
- యూఏఈలో స్కూళ్లు రీ ఓపెన్.. పేరెంట్స్ పై పెరగనున్న ఖర్చుల భారం..!!
- రియాద్ విమానాశ్రయంలో ‘సైలెంట్ ఎయిర్పోర్ట్’ ప్రాజెక్ట్ ప్రారంభం..!!
- కువైట్లో కల్తీ ఆహారంపై అధికారుల కొరడా..!!
- ఇద్దరు పౌరులను ఆస్పత్రికి తరలించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- దుబాయ్లో డెలివరీ రైడర్లకు ఉచిత భోజనం..ఆర్టీఏ కీలక కార్యక్రమం
- జైవాన్ పేమెంట్స్ స్వీకరించిన తొలి ఎయిర్లైన్గా ఎతిహాద్ ఎయిర్వేస్
- చీనాబ్ బ్రిడ్జి పై తొలిసారి 100 కిమీ వేగంతో వందే భారత్
- రూపారెడ్డి హత్య కేసులో నిందితుల విలాసవంతమైన జీవనశైలి







