ఐఎస్ సిరియాపై యుద్ధం ప్రకటించింది ..
- April 18, 2016
సిరియాపై యుద్ధం ప్రకటిస్తున్నట్టు ఐఎస్ ఉగ్రవాద అనుబంధ సంస్థ జైష్-ఎల్-నస్ర్ ప్రకటించింది. కాగా, ఐరాస భద్రతామండలి 2254వ తీర్మానం ప్రకారం...ఈఏడాది ఫిబ్రవరి 27 నుంచి సిరియాలో కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. ఈ ఒప్పందం పట్ల అంగీకారం తెలిపిన సంస్థలకు అమెరికా, రష్యా భద్రతా బలగాలు రక్షణ కల్పిస్తాయి. అయితే, అల్నుస్రా, ఐఎస్ ఉగ్రవాద సంస్థలను ఈ ఒప్పందం నుంచి మినహాయించారు. ఆయా సంస్థలకు చెందిన ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయాలని భద్రతా మండలి ఆదేశించింది. అంతేగాకుండా, కాల్పుల విరమణ ఒప్పందం సజావుగా అమలయ్యేలా చూడాలని అమెరికా, రష్యా దేశాలను కోరింది. ఈ మేరకు ఉల్లంఘనలు నమోదు చేసేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని సూచించింది. సిరియాలో కాల్పుల విరమణ ఒప్పందంతో తమకేమీ సంబంధంలేదని, డమాస్కస్ బలగాలపై పోరు కొనసాగించాలని నిర్ణయించామని జైష్-ఎల్-నస్ర్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మొహమ్మద్ రషీద్ సోమవారం రాయిటర్స్ వార్తాసంస్థకు తెలిపారు. ఇదిలా ఉండగా, జైష్-ఎల్-నస్ర్ ఉగ్రవాద సంస్థ గతేడాది ఆగస్టులో ఆవిర్భవించింది. ఇద్లెబ్, హామా తదితర నగరాల్లో ఆ సంస్థ కార్యకలాపాలు చురుకుగా కొనసాగుతున్నాయి. అయితే, ఎఫ్ఎస్ఏ ( ఫ్రీ సిరియన్ ఆర్మీ ) ఆ సంస్థకు సహకరిస్తున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈఏడాది మార్చి 12న కఫ్ర్ నబూదా నగరంలో సిరియా సైనిక దళానికి చెందిన మిగ్-21 యుద్ధ విమానాన్ని జైష్-ఎల్-నస్ర్ ఉగ్రవాదులు కూల్చివేసిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







