సైబర్‌ సెక్యూరిటీపై ప్రచారాన్ని ప్రారంభించిన సౌదీ

- October 02, 2022 , by Maagulf
సైబర్‌ సెక్యూరిటీపై ప్రచారాన్ని ప్రారంభించిన సౌదీ

రియాద్: జాతీయ సైబర్ సెక్యూరిటీ అవేర్‌నెస్ క్యాంపెయిన్‌ను ప్రారంభించినట్లు నేషనల్ సైబర్ సెక్యూరిటీ అథారిటీ(NCA) తెలిపింది. ఇది జాతీయ భద్రతను పరిరక్షించడంతోపాటు సైబర్ సెక్యూరిటీపై అవగాహన పెంచుతుందన్నారు. జాతీయ అధికారుల కోసం 12 సెషన్‌లు, సైబర్‌ సెక్యూరిటీపై అవగాహన కోసం నాలుగు అథారిటీల ప్రధాన కార్యాలయాల్లో మొబైల్ ఎగ్జిబిషన్లు, “లా తఫ్తా మజలాన్” అనే అవగాహన పెంచే ప్రోగ్రాంతో సహా సైబర్‌ సెక్యూరిటీ గురించి అవగాహన పెంచడానికి భౌతిక, డిజిటల్ ఈవెంట్‌లను ప్రచారంలో భాగంగా నిర్వహించనున్నట్లు NCA పేర్కొంది. ఈ ప్రచారం సైబర్‌ సెక్యూరిటీ పట్ల అవగాహన కల్పిచడంతోపాటు ఆన్‌లైన్ బెదిరింపులను తగ్గించడంలో సహాయపడుతుందన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com