ఎక్స్పో సిటీ దుబాయ్.. పెద్దసంఖ్యలో సందర్శకులు హాజరు
- October 02, 2022
యూఏఈ: ఎక్స్పో సిటీ దుబాయ్ అధికారిక ప్రారంభోత్సవానికి పెద్ద సంఖ్యలో సందర్శకులు హాజరయ్యారు. మొదటగా సుమారు 50 మంది ఎక్స్పో సిటీ దుబాయ్ సిబ్బంది, వారి కుటుంబాలు ఉదయం 9 గంటలకు సస్టైనబిలిటీ ఎంట్రీ పోర్టల్ను ప్రారంభించారు. ఈ సాయంత్రం Al Wasl స్పెల్బైండింగ్ లైట్ షోతో సందర్శకులను ఆకట్టుకున్నది. విజన్ పెవిలియన్, ఉమెన్స్ పెవిలియన్ సెప్టెంబరులో ప్రారంభమైన అలీఫ్ - ది మొబిలిటీ పెవిలియన్, టెర్రా - ది సస్టైనబిలిటీ పెవిలియన్ లు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. స్కై అబ్జర్వేషన్ టవర్లోకి వెళ్లేందుకు సందర్శకులు ఆసక్తి కనబరిచారు. ఎక్స్పో సిటీ దుబాయ్ లో Dhs120 వన్-డే అట్రాక్షన్స్ పాస్ విజన్ పెవిలియన్, ఉమెన్స్ పెవిలియన్స్, అలీఫ్, టెర్రాలకు ప్రవేశం కల్పిస్తుందని నిర్వాహకులు తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 10 నుండి సాయంత్రం 6 గంటల వరకు ఎక్స్పో తెరిచిఉంటుంది. సందర్శకులు పెవిలియన్కు ఒక్కొక్కరికి Dhs50 చొప్పున వ్యక్తిగత పెవిలియన్ టిక్కెట్లను కొనుగోలు చేయవచ్చు. 12 ఏళ్లు అంతకంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ఉచిత ప్రవేశాన్ని కల్పించారు. టిక్కెట్లను www.expocitydubai.comలో లేదా ఎక్స్పో సిటీ దుబాయ్లోని టిక్కెట్ కౌంటర్లలో కొనుగోలు చేయవచ్చు.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









