కువైట్కు భారత నౌకాదళ నౌకలు.. విజిటింగ్ సమాయాల్లో మార్పులు
- October 04, 2022
కువైట్: మూడు భారత నౌకాదళ నౌకలు INS TIR, INR సుజాత, ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ ICGS సారథి అక్టోబర్ 4వ తేదీన కువైట్కు చేరుకుంటున్నాయి. ఇప్పటికే వీటిని సందర్శించేందుకు పెద్ద సంఖ్యలో ఇండియన్ కమ్యూనిటీ సభ్యులు భారత రాయబార కార్యాలయంలో నమోదు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో నౌకల సందర్శన కోసం భారతీయ కమ్యూనిటీ సభ్యుల నుండి భారీ స్పందన కారణంగా, పూర్తి సమాచారంతో నమోదు చేసుకున్న వారికి విజిటింగ్ టైమ్ స్లాట్లను తిరిగి కేటాయించినట్లు భారత రాయబార కార్యాలయం తెలిపింది. విజయవంతంగా నమోదు చేసుకున్న వారందరికీ అవసరమైన సూచనలతో పాటు సమయ స్లాట్లతో కూడిన నిర్ధారణ ఇమెయిల్ను పంపినట్లు రాయబార కార్యాలయం పేర్కొంది. ప్రతి ఒక్కరూ వారి ఇమెయిల్ను తనిఖీ చేసి.. వారి సివిల్ ఐడీలు, నిర్ధారణ ఇమెయిల్ కాపీతో రీ-అలాట్ చేసిన సమయ స్లాట్లకు కనీసం 15 నిమిషాల ముందు షువైఖ్ పోర్ట్ ప్రధాన గేట్కు చేరుకోవాలని ఎంబసీ సూచించింది.
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







