కువైట్కు భారత నౌకాదళ నౌకలు.. విజిటింగ్ సమాయాల్లో మార్పులు
- October 04, 2022
కువైట్: మూడు భారత నౌకాదళ నౌకలు INS TIR, INR సుజాత, ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ ICGS సారథి అక్టోబర్ 4వ తేదీన కువైట్కు చేరుకుంటున్నాయి. ఇప్పటికే వీటిని సందర్శించేందుకు పెద్ద సంఖ్యలో ఇండియన్ కమ్యూనిటీ సభ్యులు భారత రాయబార కార్యాలయంలో నమోదు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో నౌకల సందర్శన కోసం భారతీయ కమ్యూనిటీ సభ్యుల నుండి భారీ స్పందన కారణంగా, పూర్తి సమాచారంతో నమోదు చేసుకున్న వారికి విజిటింగ్ టైమ్ స్లాట్లను తిరిగి కేటాయించినట్లు భారత రాయబార కార్యాలయం తెలిపింది. విజయవంతంగా నమోదు చేసుకున్న వారందరికీ అవసరమైన సూచనలతో పాటు సమయ స్లాట్లతో కూడిన నిర్ధారణ ఇమెయిల్ను పంపినట్లు రాయబార కార్యాలయం పేర్కొంది. ప్రతి ఒక్కరూ వారి ఇమెయిల్ను తనిఖీ చేసి.. వారి సివిల్ ఐడీలు, నిర్ధారణ ఇమెయిల్ కాపీతో రీ-అలాట్ చేసిన సమయ స్లాట్లకు కనీసం 15 నిమిషాల ముందు షువైఖ్ పోర్ట్ ప్రధాన గేట్కు చేరుకోవాలని ఎంబసీ సూచించింది.
తాజా వార్తలు
- బ్రహ్మోత్సవాలకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకు యాదాద్రి ఈఓ ఆహ్వానం
- కింగ్ ఫహద్ కాజ్వే పై టోల్ బాదుడు షురూ..!!
- ట్రాఫిక్ డిపార్టుమెంట్ కు కొత్త వర్కింగ్ అవర్స్..!!
- విద్యాసంస్థలకు మద్దతుగా మెడికల్ ఇక్విప్ మెంట్..!!
- ప్రపంచ వారసత్వ జాబితాలో ఒమన్ సైట్లకు చోటు..!!
- ఖతార్ విమానాల రాకపోకల్లో 6 శాతం వృద్ధి..!!
- స్కూళ్లలో డిస్టెన్స్ లెర్నింగ్..సిద్ధమవుతున్నారా?
- భారత్లో టీసీఎస్తో జత కట్టిన OpenAI
- 76ఏళ్ల వయస్సులో భార్యను హత్యచేసి.. మృతదేహం వద్ద కూర్చొని పక్కింట్లోకి ఫోన్..
- మే నెలలో కవిత కొత్త పార్టీ ఆవిర్భావం









