సౌదీలో చట్టాలు ఉల్లంఘించిన 15,894 మంది అరెస్టు
- October 09, 2022
రియాద్ : రెసిడెన్సీ, కార్మిక చట్టాలు, సరిహద్దు భద్రతా నిబంధనలను ఉల్లంఘించిన సుమారు 15,894 మందిని ఒక వారంలో కింగ్డమ్లోని వివిధ ప్రాంతాలలో అరెస్టు చేసినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సెప్టెంబర్ 29 నుండి అక్టోబర్ 5 వరకు వారంలో రాజ్యమంతటా వివిధ భద్రతా దళాలు నిర్వహించిన ఉమ్మడి క్షేత్ర తనిఖీల సందర్భంగా వీరిని అరెస్ట్ చేసినట్లు పేర్కొంది. ఇందులో 9,192 మంది రెసిడెన్సీ, 3,968 మంది సరిహద్దు భద్రతా నియమాలు, 2,734 మంది కార్మిక చట్టాలను ఉల్లంఘించినవారు ఉన్నారు. రాజ్యంలోకి సరిహద్దులు దాటేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు మరో 313 మంది అరెస్టయ్యారు. అరెస్టయిన వారిలో 51% మంది యెమెన్లు, 37% ఇథియోపియన్లు, 12% ఇతర జాతీయులు ఉండగా.. మరో 42 మంది సౌదీ అరేబియా నుండి బయటికి వెళ్లేందుకు ప్రయత్నించి పట్టుబడ్డారని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు మొత్తం 48,911 మంది సౌదీ చట్టాలను ఉల్లంఘించినవారని, ఇందులో 45,422 మంది పురుషులు, 3,489 మంది మహిళలు ఉన్నారని తెలిపారు.వారిలో 38,790 మంది తమ ప్రయాణ పత్రాలను పొందేందుకు వారి దౌత్య కార్యాలయాలకు, 2,169 మంది వారి ప్రయాణ రిజర్వేషన్లను పూర్తి చేయడానికి.. 8,234 మంది ఉల్లంఘించిన వారిని బహిష్కరించినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఎవరైనా చొరబాటుదారులను రాజ్యంలోకి ప్రవేశించడానికి సహాయం అందించిన వారికి గరిష్టంగా 15 సంవత్సరాల జైలు శిక్ష, SR1 మిలియన్ వరకు జరిమానా విధించబడుతుందని అంతర్గత మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.
తాజా వార్తలు
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..
- 'బెల్ ఆఫ్ ఆర్మ్స్', 'సారథి' సెంట్రల్ వర్క్షాప్ను ప్రారంభించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- మా కృషి వల్లే జిందాల్ స్టీల్ నిర్మాణం: జగన్
- షార్జా ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల కాన్సులర్ అటెస్టేషన్ సేవలు
- గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన పవన్ కల్యాణ్
- దేశంలోనే తొలిసారి.. విమానాన్ని వేలం వేసిన ED..
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!







