కువైట్లో 25% తగ్గిన ప్రధాన నేరాలు
- October 09, 2022కువైట్: గత మూడు నెలల్లో కువైట్లో ప్రధాన నేరాలు 25 శాతం తగ్గాయని భద్రతా దళాలు వెల్లడించాయి. హత్యలు, సాయుధ దోపిడీలు, బలవంతపు దొంగతనాలు, భద్రతా సిబ్బంది వలె నటించి వసూళ్లు చేయడం, ఇంటిలో చొరబడటం, తుపాకీలను ఉపయోగించి బెదిరింపులకు పాల్పడటం వంటి నేరాలు ఉన్నాయని తెలిపారు. ప్రధాన నేరాల్లో తగ్గుదల కువైట్లో స్థిరమైన భద్రతా ప్రమాణాలను తెలుపుతుందని భద్రతా వర్గాలు పేర్కొన్నాయి. పెద్ద ఎత్తున భద్రతా విస్తరణ, నిరంతర భద్రతా ప్రచారాలు, మాదకద్రవ్యాల వ్యాపారుల అరెస్ట్, సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతం చేయడం వంటి చర్యలతో ఇది సాధ్యమైందని వెల్లడించారు. కువైట్లో దాదాపు 3.4 మిలియన్ల విదేశీయులతో సహా 4.6 మిలియన్ల జనాభా ఉంది.
తాజా వార్తలు
- ఖతార్లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- ప్లేఆఫ్స్కు చేరిన హైదరాబాద్..
- నేడు లండన్ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్
- రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. రుణమాఫీ పై చర్చ..!