కువైట్లో 25% తగ్గిన ప్రధాన నేరాలు
- October 09, 2022
కువైట్: గత మూడు నెలల్లో కువైట్లో ప్రధాన నేరాలు 25 శాతం తగ్గాయని భద్రతా దళాలు వెల్లడించాయి. హత్యలు, సాయుధ దోపిడీలు, బలవంతపు దొంగతనాలు, భద్రతా సిబ్బంది వలె నటించి వసూళ్లు చేయడం, ఇంటిలో చొరబడటం, తుపాకీలను ఉపయోగించి బెదిరింపులకు పాల్పడటం వంటి నేరాలు ఉన్నాయని తెలిపారు. ప్రధాన నేరాల్లో తగ్గుదల కువైట్లో స్థిరమైన భద్రతా ప్రమాణాలను తెలుపుతుందని భద్రతా వర్గాలు పేర్కొన్నాయి. పెద్ద ఎత్తున భద్రతా విస్తరణ, నిరంతర భద్రతా ప్రచారాలు, మాదకద్రవ్యాల వ్యాపారుల అరెస్ట్, సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతం చేయడం వంటి చర్యలతో ఇది సాధ్యమైందని వెల్లడించారు. కువైట్లో దాదాపు 3.4 మిలియన్ల విదేశీయులతో సహా 4.6 మిలియన్ల జనాభా ఉంది.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







