కువైట్లో 25% తగ్గిన ప్రధాన నేరాలు
- October 09, 2022
కువైట్: గత మూడు నెలల్లో కువైట్లో ప్రధాన నేరాలు 25 శాతం తగ్గాయని భద్రతా దళాలు వెల్లడించాయి. హత్యలు, సాయుధ దోపిడీలు, బలవంతపు దొంగతనాలు, భద్రతా సిబ్బంది వలె నటించి వసూళ్లు చేయడం, ఇంటిలో చొరబడటం, తుపాకీలను ఉపయోగించి బెదిరింపులకు పాల్పడటం వంటి నేరాలు ఉన్నాయని తెలిపారు. ప్రధాన నేరాల్లో తగ్గుదల కువైట్లో స్థిరమైన భద్రతా ప్రమాణాలను తెలుపుతుందని భద్రతా వర్గాలు పేర్కొన్నాయి. పెద్ద ఎత్తున భద్రతా విస్తరణ, నిరంతర భద్రతా ప్రచారాలు, మాదకద్రవ్యాల వ్యాపారుల అరెస్ట్, సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతం చేయడం వంటి చర్యలతో ఇది సాధ్యమైందని వెల్లడించారు. కువైట్లో దాదాపు 3.4 మిలియన్ల విదేశీయులతో సహా 4.6 మిలియన్ల జనాభా ఉంది.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









