ఒమన్ పర్యాటక రంగం రికవరీ.. త్వరలో కొత్త ప్రాజెక్టులు
- October 09, 2022
మస్కట్: ఒమన్ సుల్తానేట్లో పర్యాటక రంగం క్రమంగా మునుపటి స్థాయికి చేరుకుంటుందని హెరిటేజ్, టూరిజం శాఖ మంత్రి సలేం అల్ మహ్రూఖీ తెలిపారు. పర్యాటక రంగ పునరుద్ధరణకు త్వరలో కొత్తగా అనేక ప్రాజెక్టులు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. పర్యాటకులకు ఈ ప్రాజెక్ట్లు వైవిధ్యంతో కూడిన అనుభవాలను అందిస్తాయని వివారించారు. ప్రస్తుతం అమ్రామ్ కంపెనీ మద్దతు, భాగస్వామ్యంతో అనేక గవర్నరేట్లలో పబ్లిక్ యుటిలిటీల ప్రణాళికలు, అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. విదేశీ పెట్టుబడులతో నాణ్యమైన ప్రాజెక్టులు ఆమోదించబడిన కార్యక్రమాల ప్రకారం కొనసాగుతాయన్నారు. పర్యాటక ఉత్పత్తులను అందించడంతోపాటు ఆతిథ్యం, వినోదం, వినోద సౌకర్యాలను అందించడమే లక్ష్యంగా అల్ బురైమి తలాలత్ ప్రాజెక్ట్.. 700,000 రియాల్స్ ఖరీదు చేసే అల్ బురైమిలోని అల్-అబైలా పార్క్ను అభివృద్ధి చేసే ప్రాజెక్టులపై పని జరుగుతోందని మంత్రి వివరించారు. వీటితో పాటు అల్ దఖిలియా గవర్నరేట్లో.. నిజ్వా గేట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్లలో సాంస్కృతిక చరిత్రను టూరిస్టులకు పరిచయం చేయడానికి ఇంటరాక్టివ్ ప్లాట్ఫారమ్లు, డిజిటల్ ప్యానెల్లు ఉంటాయని తెలిపారు. అలాగే అల్ దహిరా గవర్నరేట్లో, అటాలా ఇబ్రి ప్రాజెక్ట్, యాన్కుల్ రెస్ట్ హౌస్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్, ధాంక్ రెస్ట్ హౌస్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అనే మూడు ప్రాజెక్ట్లలో ప్రస్తుతం పని జరుగుతోందని, మొత్తం 2 మిలియన్లకు పైగా ఖర్చుతో కొత్త ప్రాజెక్టుల పనులు జరుతున్నయని హిస్ ఎక్సలెన్సీ స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!







