మాదకద్రవ్యాల వ్యాపారికి 10 సంవత్సరాల జైలు, BD5,000 జరిమానా
- October 09, 2022బహ్రెయిన్: ఒక డ్రగ్ పెడ్లర్కు 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు BD5,000 జరిమానాను అప్పీల్ కోర్ట్ ఖరారు చేసింది. దీంతో పాటు జైలు శిక్ష పూర్తయిన తర్వాత అతడిని దేశం నుంచి బహిష్కరించాలని అధికారులను కోర్టు ఆదేశించింది. ఆసియన్ జాతీయుడైన వ్యక్తి రాజ్యంలో డ్రగ్స్ విక్రయిస్తున్నాడని, పక్కా సమాచారం ఆధారంగా బహ్రెయిన్ పోలీసులు పన్నిన ఉచ్చులో పడ్డాడని కోర్టు ఫైల్స్ చెబుతున్నాయి. రహస్య ఆపరేషన్ ద్వారా అతడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఒక రహస్య ఏజెంట్ అనుమానితుడిని సంప్రదించాడని, BD150 విలువైన 'గంజాయి'ని కొనుగోలు చేయడానికి ఆర్డర్ ఇవ్వగా.. దానికి అనుమానితుడు అంగీకరించాడు. పోలీసుల బృందం నిఘాలో ఉంచిన సల్మాబాద్ ప్రాంతంలో డ్రగ్స్ డెలివరీ చేసేందుకు వచ్చిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పబ్లిక్ ప్రాసిక్యూషన్ అతనిపై గంజాయి అమ్మకం, మాదకద్రవ్యాలను ఉపయోగించాలనే ఉద్దేశ్యంతో కొనుగోలు చేశాడని అభియోగాలు మోపింది.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..