మాదకద్రవ్యాల వ్యాపారికి 10 సంవత్సరాల జైలు, BD5,000 జరిమానా
- October 09, 2022
బహ్రెయిన్: ఒక డ్రగ్ పెడ్లర్కు 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు BD5,000 జరిమానాను అప్పీల్ కోర్ట్ ఖరారు చేసింది. దీంతో పాటు జైలు శిక్ష పూర్తయిన తర్వాత అతడిని దేశం నుంచి బహిష్కరించాలని అధికారులను కోర్టు ఆదేశించింది. ఆసియన్ జాతీయుడైన వ్యక్తి రాజ్యంలో డ్రగ్స్ విక్రయిస్తున్నాడని, పక్కా సమాచారం ఆధారంగా బహ్రెయిన్ పోలీసులు పన్నిన ఉచ్చులో పడ్డాడని కోర్టు ఫైల్స్ చెబుతున్నాయి. రహస్య ఆపరేషన్ ద్వారా అతడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఒక రహస్య ఏజెంట్ అనుమానితుడిని సంప్రదించాడని, BD150 విలువైన 'గంజాయి'ని కొనుగోలు చేయడానికి ఆర్డర్ ఇవ్వగా.. దానికి అనుమానితుడు అంగీకరించాడు. పోలీసుల బృందం నిఘాలో ఉంచిన సల్మాబాద్ ప్రాంతంలో డ్రగ్స్ డెలివరీ చేసేందుకు వచ్చిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పబ్లిక్ ప్రాసిక్యూషన్ అతనిపై గంజాయి అమ్మకం, మాదకద్రవ్యాలను ఉపయోగించాలనే ఉద్దేశ్యంతో కొనుగోలు చేశాడని అభియోగాలు మోపింది.
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







