మాదకద్రవ్యాల వ్యాపారికి 10 సంవత్సరాల జైలు, BD5,000 జరిమానా
- October 09, 2022
బహ్రెయిన్: ఒక డ్రగ్ పెడ్లర్కు 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు BD5,000 జరిమానాను అప్పీల్ కోర్ట్ ఖరారు చేసింది. దీంతో పాటు జైలు శిక్ష పూర్తయిన తర్వాత అతడిని దేశం నుంచి బహిష్కరించాలని అధికారులను కోర్టు ఆదేశించింది. ఆసియన్ జాతీయుడైన వ్యక్తి రాజ్యంలో డ్రగ్స్ విక్రయిస్తున్నాడని, పక్కా సమాచారం ఆధారంగా బహ్రెయిన్ పోలీసులు పన్నిన ఉచ్చులో పడ్డాడని కోర్టు ఫైల్స్ చెబుతున్నాయి. రహస్య ఆపరేషన్ ద్వారా అతడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఒక రహస్య ఏజెంట్ అనుమానితుడిని సంప్రదించాడని, BD150 విలువైన 'గంజాయి'ని కొనుగోలు చేయడానికి ఆర్డర్ ఇవ్వగా.. దానికి అనుమానితుడు అంగీకరించాడు. పోలీసుల బృందం నిఘాలో ఉంచిన సల్మాబాద్ ప్రాంతంలో డ్రగ్స్ డెలివరీ చేసేందుకు వచ్చిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పబ్లిక్ ప్రాసిక్యూషన్ అతనిపై గంజాయి అమ్మకం, మాదకద్రవ్యాలను ఉపయోగించాలనే ఉద్దేశ్యంతో కొనుగోలు చేశాడని అభియోగాలు మోపింది.
తాజా వార్తలు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంతను నారాయణ్ భేటీ
- ఇండియా స్కిల్స్ సౌత్ రీజినల్స్(2025-26) లో ఆంధ్రప్రదేశ్ కు 23 పతకాలు
- 8వ వేతన సంఘం అప్డేట్..
- గల్ఫ్ ఎయిర్ టేకాఫ్ సేల్..తక్కవ ధరలకే 150,000 టిక్కెట్లు..!!
- సులైబిఖాట్ బీచ్లో ఫోటోగ్రాఫర్లపై ఆంక్షలు..!!
- ట్రావెల్ అండ్ టూరిజం సంస్థకు OMR15,815 ఫైన్..!!
- అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు..మార్చిలో పెట్రోల్ ధరలు పెరుగుతాయా?
- డిజిటల్ ఆడిటర్ కార్డును ప్రారంభించిన ఖతార్..!!
- 'చెక్ యువర్ హెల్త్' క్యాంపెయిన్..నిమిషాల్లో 10 పరీక్షలు..!!
- భారత్కు ట్రంప్ షాక్..









