డీఎంకే అధ్యక్షుడిగా ఎంకే స్టాలిన్..
- October 09, 2022
చెన్నై: డీఎంకే (ద్రావిడ మున్నేట్ర కజగం) అధ్యక్షుడిగా ఎంకే స్టాలిన్ రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం జరిగిన పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశంలో తమిళనాడు ముఖ్యమంత్రిని పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మరోవైపు డీఎంకే ప్రధాన కార్యదర్శిగా, కోశాధికారిగా డీఎంకే నేతలు దురై మురుగన్, టీఆర్బాలు ఎన్నికయ్యారు. ముగ్గురు నేతలు రెండోసారి తమ పదవులకు ఎన్నికయ్యారు. సాధారణ కౌన్సిల్ సమావేశంకు హాజరయిన ముఖ్యమంత్రి స్టాలిన్ కు పార్టీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.
డీఎంకే 15వ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ స్థాయిల్లో పార్టీ పదవులకు జరిగిన ఎన్నికల తర్వాత పార్టీ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి పదవులకు ఎన్నుకున్నారు. దివంగత పార్టీ వ్యవస్థాపకుడు ఎం. కరుణానిధి చిన్న కుమారుడు స్టాలిన్. డీఎంకె కోశాధికారి, యువజన విభాగం కార్యదర్శితో సహా అనేక పార్టీ పదవులను నిర్వహించారు. 2018లో కరుణానిధి మరణానంతరం పార్టీ అధ్యక్షుడిగా స్టాలిన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తాజాగా మరోసారి స్టాలిన్ డీఎంకే అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
తాజా వార్తలు
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం
- ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్
- 10% వరకు పెరగనున్న విమాన ఛార్జీలు..!!
- కువైట్ లో రెండు రోజులపాటు భారీ వర్షాలు..!!
- సౌదీలో చట్టాలను ఉల్లంఘించిన 14,487 మంది అరెస్టు..!!
- ఇజ్రాయెల్ చర్యను ఖండించిన ఒమన్ సహా 14 దేశాలు..!!
- ఖతార్ లో అడ్మిషన్లు..20 ఇ-సేవలు ఆవిష్కరణ..!!
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!









