డీఎంకే అధ్యక్షుడిగా ఎంకే స్టాలిన్..
- October 09, 2022
చెన్నై: డీఎంకే (ద్రావిడ మున్నేట్ర కజగం) అధ్యక్షుడిగా ఎంకే స్టాలిన్ రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం జరిగిన పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశంలో తమిళనాడు ముఖ్యమంత్రిని పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మరోవైపు డీఎంకే ప్రధాన కార్యదర్శిగా, కోశాధికారిగా డీఎంకే నేతలు దురై మురుగన్, టీఆర్బాలు ఎన్నికయ్యారు. ముగ్గురు నేతలు రెండోసారి తమ పదవులకు ఎన్నికయ్యారు. సాధారణ కౌన్సిల్ సమావేశంకు హాజరయిన ముఖ్యమంత్రి స్టాలిన్ కు పార్టీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.
డీఎంకే 15వ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ స్థాయిల్లో పార్టీ పదవులకు జరిగిన ఎన్నికల తర్వాత పార్టీ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి పదవులకు ఎన్నుకున్నారు. దివంగత పార్టీ వ్యవస్థాపకుడు ఎం. కరుణానిధి చిన్న కుమారుడు స్టాలిన్. డీఎంకె కోశాధికారి, యువజన విభాగం కార్యదర్శితో సహా అనేక పార్టీ పదవులను నిర్వహించారు. 2018లో కరుణానిధి మరణానంతరం పార్టీ అధ్యక్షుడిగా స్టాలిన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తాజాగా మరోసారి స్టాలిన్ డీఎంకే అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
తాజా వార్తలు
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం
- స్పీడ్ పోస్టు పేరుతో గంజాయి స్మగ్లింగ్..హైదరాబాద్లో భారీ రాకెట్ గుట్టురట్టు
- గల్ఫ్ కార్మికుడి కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సాయం
- 98% మురుగునీటి శుద్ధి..పునర్వినియోగంలో అష్ఘల్ విజయం..!!
- బహ్రెయిన్ వాసులకు వీసా రహిత షెంజెన్ ప్రయాణం..జర్మనీ కృషి..!!
- అల్-అహ్మదీలో స్పెషల్ డ్రైవ్..8 దుకాణాలు సీజ్..!!
- ఒమన్ లో చేపల ధరలపై పర్యవేక్షణ బలోపేతం..!!
- సౌదీలో 385 మందిపై విచారణ, 130 మంది అరెస్టు..!!
- సోషల్ మీడియాలో సమ్మర్ ట్రావెల్ ప్లాన్స్ షేరింగ్.. అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!







