డీఎంకే అధ్యక్షుడిగా ఎంకే స్టాలిన్..
- October 09, 2022
చెన్నై: డీఎంకే (ద్రావిడ మున్నేట్ర కజగం) అధ్యక్షుడిగా ఎంకే స్టాలిన్ రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం జరిగిన పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశంలో తమిళనాడు ముఖ్యమంత్రిని పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మరోవైపు డీఎంకే ప్రధాన కార్యదర్శిగా, కోశాధికారిగా డీఎంకే నేతలు దురై మురుగన్, టీఆర్బాలు ఎన్నికయ్యారు. ముగ్గురు నేతలు రెండోసారి తమ పదవులకు ఎన్నికయ్యారు. సాధారణ కౌన్సిల్ సమావేశంకు హాజరయిన ముఖ్యమంత్రి స్టాలిన్ కు పార్టీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.
డీఎంకే 15వ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ స్థాయిల్లో పార్టీ పదవులకు జరిగిన ఎన్నికల తర్వాత పార్టీ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి పదవులకు ఎన్నుకున్నారు. దివంగత పార్టీ వ్యవస్థాపకుడు ఎం. కరుణానిధి చిన్న కుమారుడు స్టాలిన్. డీఎంకె కోశాధికారి, యువజన విభాగం కార్యదర్శితో సహా అనేక పార్టీ పదవులను నిర్వహించారు. 2018లో కరుణానిధి మరణానంతరం పార్టీ అధ్యక్షుడిగా స్టాలిన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తాజాగా మరోసారి స్టాలిన్ డీఎంకే అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
తాజా వార్తలు
- శ్రీలంక పై న్యూజిలాండ్ విజయం
- సైబరాబాద్లో ‘ఏఐ’ ట్రాఫిక్ మంత్రం
- ఇజ్రాయెల్ పార్లమెంట్లో చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ..
- జూలైకి వెలిగొండ తొలిదశ పూర్తి చేసి నీళ్లు ఇస్తాం: సీఎం చంద్రబాబు
- నెతన్యాహు ఘన స్వాగతం, మోదీ ఇజ్రాయెల్ పర్యటన హైలైట్!
- గుడ్ న్యూస్..భారత్ కు వెనిజులా ఆయిల్ వచ్చేస్తోంది!
- ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యం
- లోక్ భవన్లో అరుణాచల్ ప్రదేశ్, మిజోరం వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంతను నారాయణ్ భేటీ
- ఇండియా స్కిల్స్ సౌత్ రీజినల్స్(2025-26) లో ఆంధ్రప్రదేశ్ కు 23 పతకాలు









