114 మద్యం సీసాలు, డ్రగ్స్ స్వాధీనం.. నలుగురి అరెస్టు
- October 09, 2022
కువైట్ సిటీ: ముబారక్ అల్-కబీర్లోని సభాన్ ప్రాంతంలో స్థానికంగా శుద్ధి చేసిన 114 మద్యం బాటిళ్లతోపాటు డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు సెక్యూరిటీ పెట్రోలింగ్ పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి నలుగురిని అరెస్టు చేశామన్నారు. అరెస్టు సమయంలో ఇద్దరు నిందితులు మత్తులో ఉన్నారని తెలిపారు. అరెస్ట్ చేసే సమయంలో నిందితులు తప్పించుకునే ప్రయత్నంలో తమ కారుతో పెట్రోలింగ్ కారును ఢీకొట్టినట్లు వివరించారు. ఆ ఇద్దరు నిందితులను ఖురైన్ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నామని, ఆ సమయంలో వారిద్దరు మత్తులో ఉన్నారని.. వారివద్ద డ్రగ్స్ ను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు అప్పగించినట్లు పెట్రోలింగ్ పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- డ్రగ్స్, సైబర్ క్రైమ్ నియంత్రణపై సమగ్ర ప్రణాళికలు రూపొందించాలి: సీఎం రేవంత్
- బెంగళూరులో శ్రీశ్రీ రవిశంకర్ 70వ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- షార్జా: ఈద్ అల్ అధా సందర్భంగా విడుదల కానున్న 227 మంది ఖైదీలు
- ఈద్ అల్ అధా ముందు మే నెల జీతాలు చెల్లించాలి: కార్మిక శాఖ ఆదేశాలు
- ఈద్ అల్ అధా సందర్భంగా విడుదల కాబోతున్న 956 మంది ఖైదీలు
- హర్ముజ్ జలసంధికి చెక్..
- సౌదీలో 20 ఏళ్ల కష్టజీవితం అనంతరం స్వదేశానికి చేరనున్న ఏపీ వాసి
- స్టాలిన్ జోస్యం తో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్న సీఎం విజయ్
- లోక్ భవన్లో తెలంగాణ గవర్నర్ను కలిసిన డీజీపీ సి.వి. ఆనంద్
- ఇటలీ తో సంబంధం..అంతకుమించి: ప్రధాని మోదీ









