114 మద్యం సీసాలు, డ్రగ్స్ స్వాధీనం.. నలుగురి అరెస్టు
- October 09, 2022
కువైట్ సిటీ: ముబారక్ అల్-కబీర్లోని సభాన్ ప్రాంతంలో స్థానికంగా శుద్ధి చేసిన 114 మద్యం బాటిళ్లతోపాటు డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు సెక్యూరిటీ పెట్రోలింగ్ పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి నలుగురిని అరెస్టు చేశామన్నారు. అరెస్టు సమయంలో ఇద్దరు నిందితులు మత్తులో ఉన్నారని తెలిపారు. అరెస్ట్ చేసే సమయంలో నిందితులు తప్పించుకునే ప్రయత్నంలో తమ కారుతో పెట్రోలింగ్ కారును ఢీకొట్టినట్లు వివరించారు. ఆ ఇద్దరు నిందితులను ఖురైన్ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నామని, ఆ సమయంలో వారిద్దరు మత్తులో ఉన్నారని.. వారివద్ద డ్రగ్స్ ను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు అప్పగించినట్లు పెట్రోలింగ్ పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







