HCA అధ్యక్షుడు అజారుద్దీన్పై మరో కేసు..
- October 10, 2022
హైదరాబాద్: HCA అధ్యక్షుడు అజారుద్దీన్పై మరో కేసు నమోదైంది. ఇటీవల కాలంలో HCA తరుచు వివాదంలో చిక్కుంటున్న సంగతి తెలిసిందే.సెప్టెంబర్ 25న ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన ఇండియా – ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ నేపథ్యంలో హెచ్సీఏ (HCA) మీద కేసుల మీద కేసులు నమోదయ్యాయి. అజారుద్దీన్తో పాటు హెచ్సీఏ నిర్వాహకులపై హైదరాబాద్లోని పలు పోలీస్ స్టేషన్లలో మూడు కేసులు నమోదయ్యాయి. ఇక ఇప్పుడు అధ్యక్షుడు అజారుద్దీన్పై మరో కేసు నమోదైంది.
హెచ్సీఏ మాజీ అధ్యక్షుడు జి.వినోద్, సెక్రటరీ శేషు నారాయణ్, హెచ్సీఏ మెంబర్ చిట్టి శ్రీధర్ బాబు కలిసి రాచకొండ సీపీ మహేశ్ భగవత్కు పిర్యాదు చేశారు. సెప్టెంబర్ 26 తేదీతోనే హెచ్సీఏ ప్రెసిడెంట్ అజారుద్దీన్ గడువు ముగిసిందని.. అయినా పదవిలో కొనసాగుతున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. గడువు ముగిసిన తర్వాత కూడా తప్పుడు డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి బీసీసీఐతో పాటు ఈసీ కమిటీని తప్పుదోవ పట్టించే విధంగా అజారుద్దీన్ వ్యవహరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పదవి కాలంపై ఎవరిని సంప్రదించకుండా ఆయనకు ఆయనే గడువు పొడిగించుకుంటూ ఉత్తర్వులు జారీ చేసుకున్నారని కంప్లైంట్లో వివరించారు. ఈ నెల 18న బీసీసీఐ జనరల్ బాడీ మీటింగ్కు హాజరు అయ్యేందుకు అజారుద్దీన్ తన పదవి సమయాన్ని పొడిగించుకున్నట్లు ఆరోపించారు. ఈ ఆరోపణలను పరిగణలోకి తీసుకుని.. అజారుద్దీన్పై క్రిమినల్ కేసు నమోదు చేసి.. చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు.
తాజా వార్తలు
- ఇరాన్ పై దూకుడుకు పెంచిన ట్రంప్..
- చార్లెట్లో ‘NATS’ ఉచిత వైద్య శిబిరం
- ఎబోలా వైరస్ కలకలం: కాంగోలో 118 మంది మృతి..
- రాలీ పోలీసులతో ప్రవాస తెలుగు పిల్లల ముఖాముఖి
- రోమ్ చేరుకున్న ప్రధాని మోదీ.. ప్రధాని మెలోనీతో భేటీ
- కాన్సాస్ నగరంలో డా.మాగంటి మురళీ మోహన్కు సువర్ణ సత్కారం
- రోమ్లో భారతీయ సమాజం ప్రధాని మోదీకు ఘన స్వాగతం..
- ఎబోలా వైరస్ ను ఎదుర్కోవడానికి సిద్ధం: యూఏఈ
- ప్రైవేట్ కంటెంట్ షేరింగ్ పై పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరిక..!!
- అడ్డదిడ్డ పార్కింగ్..కమిటీని ఏర్పాటు చేసిన కువైట్..!!









