దుబాయ్లో ఎగిరిన మొదటి ఎలక్ట్రిక్ ఫ్లైయింగ్ కార్..
- October 12, 2022
దుబాయ్: దుబాయ్లో ఒక ‘ఫ్లఫ్లైయింగ్ కార్’ను టెస్ట్ రన్ నిర్వహించారు.ఇది ఎలక్ట్రిక్ ఫ్లైయింగ్ కార్ కావడం మరో విశేషం. చైనాకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ‘ఎక్స్ పెంగ్’ అనే సంస్థ ఈ కారును తయారు చేసింది. ఇందులో ఇద్దరు ప్రయాణించే వీలుంది. దీనికి నాలుగు వైపులా కలిపి, ప్రతి వైపు రెండు చొప్పున మొత్తం ఎనిమిది రెక్కలుంటాయి. మానవ రహితంగా ఈ ‘ఫ్లైయింగ్ కార్’ను విజయవంతంగా పరీక్షించారు. దాదాపు 90 నిమిషాలపాటు ఇది ప్రయాణించి, విజయవంతంగా ల్యాండ్ అయింది.ఈ ఫ్లైయింగ్ కార్ గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు.GITEX లో ఫ్లైయింగ్ కార్ ను ప్రదర్శించారు.త్వరలోనే అంతర్జాతీయ మార్కెట్లోకి వస్తామని కంపెనీ నిర్వాహకులు తెలిపారు.
గత జూలైలో మనుషులతో ఈ కారు ప్రయాణిచిందని, భవిష్యత్తు ఆవిష్కరణలకు తమ కారు, సాంకేతికత ఉపయోగపడుతుందని కంపెనీ ప్రతినిధులు చెప్పారు.భవిష్యత్తులో పైలట్ లేకుండానే ప్రయాణించగలిగే ఇలాంటి కార్లు మరింతగా అందుబాటులోకి వస్తాయన్నారు. అయితే, దీనికి ముందు ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.


తాజా వార్తలు
- IPL2026: ప్లే ఆఫ్స్కు హైదరాబాద్..చెన్నై ఘన విజయం
- 'స్మైలింగ్ బుద్ధా' అణు పరీక్షకు 52 ఏళ్లు: మల్లికార్జున ఖర్గే
- నక్సల్స్ రహిత తెలంగాణను తీర్చిదిద్దిన పోలీస్ అధికారులకు సన్మానం..!
- అత్యంత అరుదైన కిడ్నీ క్యాన్సర్ను జయించిన 8 నెలల చిన్నారి
- మహారాష్ట్ర విద్యార్థులతో ‘యువ సంగం’ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ అబ్దుల్ నజీర్
- ఎస్ఐబీ కార్యాలయాన్ని సందర్శించిన డీజీపీ సి.వి.ఆనంద్
- కర్ణాటక దుబారే క్యాంప్లో విషాదం..
- ఢిల్లీలో మెరిసిన భారత తొలి బుల్లెట్ ట్రైన్ లుక్!
- శాంతిభద్రతల పరిరక్షణలో సరికొత్త అస్త్రం 'సాక్ ఐ'
- యూఏఈ ప్రైవేట్ ఉద్యోగులకు ఈద్ అల్ అదా సెలవులు ప్రకటింపు









