6 రోజుల మలేషియా, సింగపూర్ పర్యటనకు ముప్పవరపు వెంకయ్యనాయుడు
- October 13, 2022
న్యూఢిల్లీ: 6 రోజుల మలేషియా, సింగపూర్ పర్యటనకు గౌరవ పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు బయలుదేరి వెళ్ళనున్నారు. ఈ నెల 14న హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్ళనున్న ఆయన, అక్కడ పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
14వ తేదీన కౌలాలంపూర్ చేరుకున్న వెంటనే అక్కడ భారతీయ సంతతి ఏర్పాటు చేయనున్న ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొననున్నారు.ఈ కార్యక్రమానికి ప్రధానంగా వివిధ రంగాలకు చెందిన భారతీయ ప్రముఖులు హాజరు కానున్నారు.
15వ తేదీన మలేషియాలో తెలుగు అకాడమీని సందర్శించనున్న ముప్పవరపు వెంకయ్యనాయుడు, తెలుగు అసోసియేషన్ ఆఫ్ మలేషియా వారు ఏర్పాటు చేయనున్న కార్యక్రమంలో ప్రసంగిస్తారు.16వ తేదీన సింగపూర్ చేరుకోనున్న ఆయన, అదే రోజు సాయంత్రం శ్రీ సాంస్కృతిక కళాసారధి, సింగపూర్ వారి ద్వితీయ వార్షికోత్సవాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం 17వ తేదీ ఉదయం సింగపూర్ లో ఉన్న గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తారు.ఈ కార్యక్రమాలన్నింటినీ ముగించుకుని అక్టోబర్19వ తేదీని ముప్పవరపు వెంకయ్యనాయుడు తిరిగి భారత్ చేరుకుంటారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







