6 రోజుల మలేషియా, సింగపూర్ పర్యటనకు ముప్పవరపు వెంకయ్యనాయుడు
- October 13, 2022
న్యూఢిల్లీ: 6 రోజుల మలేషియా, సింగపూర్ పర్యటనకు గౌరవ పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు బయలుదేరి వెళ్ళనున్నారు. ఈ నెల 14న హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్ళనున్న ఆయన, అక్కడ పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
14వ తేదీన కౌలాలంపూర్ చేరుకున్న వెంటనే అక్కడ భారతీయ సంతతి ఏర్పాటు చేయనున్న ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొననున్నారు.ఈ కార్యక్రమానికి ప్రధానంగా వివిధ రంగాలకు చెందిన భారతీయ ప్రముఖులు హాజరు కానున్నారు.
15వ తేదీన మలేషియాలో తెలుగు అకాడమీని సందర్శించనున్న ముప్పవరపు వెంకయ్యనాయుడు, తెలుగు అసోసియేషన్ ఆఫ్ మలేషియా వారు ఏర్పాటు చేయనున్న కార్యక్రమంలో ప్రసంగిస్తారు.16వ తేదీన సింగపూర్ చేరుకోనున్న ఆయన, అదే రోజు సాయంత్రం శ్రీ సాంస్కృతిక కళాసారధి, సింగపూర్ వారి ద్వితీయ వార్షికోత్సవాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం 17వ తేదీ ఉదయం సింగపూర్ లో ఉన్న గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తారు.ఈ కార్యక్రమాలన్నింటినీ ముగించుకుని అక్టోబర్19వ తేదీని ముప్పవరపు వెంకయ్యనాయుడు తిరిగి భారత్ చేరుకుంటారు.
తాజా వార్తలు
- ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- ఢిల్లీ వేదికగా తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ను ప్రశ్నించిన పవన్ కల్యాణ్!
- సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్తో సీఎం చంద్రబాబు భేటీ
- అభిజీత్ దిప్కే పై దాడి..
- యూనిఫైడ్ గల్ఫ్ లెజిస్టేటివ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో నిత్యవసర ధరలలో తేడాలు..తనిఖీలకు పిలుపు..!!
- డేటా షేరింగ్పై NCSA ప్రైవసీ అవేర్నెస్ క్యాంపెయిన్..!!
- చాలెట్లు, రెస్ట్ హౌజెస్ రెంట్..హెచ్చరించిన కువైట్..!!
- యూఏఈలో నీట్ యూజీ 2026.. పటిష్టమైన భద్రతా చర్యలు..సూచనలు..!!
- దుక్మ్ పోర్ట్ కు భారతీయుడి మృతదేహం..!!









