బహ్రెయిన్ లో నిత్యవసర ధరలలో తేడాలు..తనిఖీలకు పిలుపు..!!

- June 15, 2026 , by Maagulf
బహ్రెయిన్ లో నిత్యవసర ధరలలో తేడాలు..తనిఖీలకు పిలుపు..!!

మనామా: బహ్రెయిన్ నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంపై ప్రజలు ఆందోళన వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా గుడ్ల ధరలలో భారీగా తేడాలు ఉన్నాయన్న ఫిర్యాదులు ఇటీవల పెరిగిన నేపథ్యంలో స్థానిక దుకాణాలలో తనిఖీలకు అధికారులు పిలుపునిచ్చారు.  ఉత్తర మున్సిపల్ కౌన్సిల్ సభ్యుడు మహమ్మద్ సాద్ అల్ దోసెరి మాట్లాడుతూ.. ముఖ్యంగా నివాస సముదాయాలలో ఉన్న కిరాణా దుకాణాలలో పర్యవేక్షణను ముమ్మరం చేయాలని సంబంధిత అధికారులను కోరారు.

కుటుంబాలు తమ రోజువారీ అవసరాలను కొనుగోలు చేయడానికి ఈ దుకాణాలే ప్రధాన వనరు అని, అందువల్ల నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయో లేదో నిర్ధారించుకోవడానికి క్రమం తప్పకుండా తనిఖీలు చాలా అవసరమని ఆయన తెలిపారు.

గుడ్ల ధరలలో గణనీయమైన వ్యత్యాసాలను అల్ దోసెరి ఎత్తిచూపారు. కొన్ని దుకాణాలు గుడ్లను BD2.700 లేదా BD2.200కు అమ్ముతుండగా, మరికొన్ని అదే ఉత్పత్తిని BD1.500 నుండి BD1.700 మధ్య అమ్ముతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ ధరల వ్యత్యాసం వినియోగదారులలో ఆందోళనలను రేకెత్తిస్తోందన్నారు. గుడ్లు మరియు ఇతర నిత్యావసర ఆహార పదార్థాలలో ఇలాంటి ధరల వ్యత్యాసాలపై విస్తృతంగా తనిఖీలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

దుకాణం దారులు ధరల పారదర్శకత పాటించాలని, అమ్మకానికి అందుబాటులో ఉన్న అన్ని వస్తువులపై ధరలను స్పష్టంగా ప్రదర్శించాలని దుకాణాలను కోరారు. అలాగే, ధరలు, ఉత్పత్తి నాణ్యత మరియు వాణిజ్య ఉల్లంఘనలకు సంబంధించిన వినియోగదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించడానికి 24-గంటల హాట్‌లైన్‌ను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com