దుక్మ్ పోర్ట్ కు భారతీయుడి మృతదేహం..!!

- June 15, 2026 , by Maagulf
దుక్మ్ పోర్ట్ కు భారతీయుడి మృతదేహం..!!

మస్కట్: అనారోగ్య సమస్యల కారణంగా మరణించిన భారతీయ పౌరుడు నిశాంత్ ఉర్థనథన్ మృతదేహాన్ని, ఒమన్‌లోని దుక్మ్ ఓడరేవు వద్ద MT Celestial నౌక నుండి కిందకు దించి, ఆరోగ్య శాఖ ఆసుపత్రికి తరలించినట్లు మస్కట్‌లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. మృతదేహాన్ని భారత్‌కు తరలించేందుకు వీలుగా మృతుని కుటుంబ సభ్యులు మరియు ఒమన్ అధికారులతో సమన్వయం చేసుకుంటున్నట్టు వెల్లడించింది.

"శ్రీ నిశాంత్ ఉర్థనథన్ మృతదేహాన్ని దుక్మ్ ఓడరేవు వద్ద MT Celestial నౌక నుండి కిందకు దించి, దుక్మ్‌లోని ఆరోగ్య శాఖ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని వీలైనంత త్వరగా భారత్‌కు తరలించేందుకు మస్కట్‌లోని భారత రాయబార కార్యాలయం మృతుని కుటుంబం మరియు సంబంధిత ఒమన్ అధికారులతో కలిసి పనిచేస్తున్నారు." అని రాయబార కార్యాలయం 'X' వేదికగా ఒక ప్రకటనలో తెలిపింది.

భారతీయ నావికుడి మృతదేహాన్ని స్వదేశానికి తరలించే ప్రక్రియను వేగవంతం చేయడానికి మస్కట్‌లోని భారత రాయబార కార్యాలయం నౌక నిర్వహణ సంస్థ మరియు ఒమన్ అధికారులతో కలిసి పనిచేస్తోంది. దుక్మ్ ఓడరేవులో నిలిపి ఉంచిన MT Celestial నౌకలో ఉన్నప్పుడు అనారోగ్య సమస్యల కారణంగా నిశాంత్ ఉర్థనథన్ మరణించారు. నిశాంత్ ఉర్తనాథన్  భార్య సరబిన్, ఆయన పార్థివ దేహాన్ని స్వదేశానికి రప్పించాలని మరియు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com