మలేషియాలో తెలుగు అకాడమీని సందర్శించిన వెంకయ్య నాయుడు

- October 15, 2022 , by Maagulf
మలేషియాలో తెలుగు అకాడమీని సందర్శించిన వెంకయ్య నాయుడు

కౌలలంపూర్: మలేసియా తెలుగు సంఘం వారు ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన రావంగ్ లోని మలేషియా తెలుగు అకాడమీని సందర్శించిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు.ఈ విభాగం ద్వారా వారు తెలుగు భాష సంస్కృతి, లలితకళలకు సంబంధించిన విద్యాబోధన చేయడమే గాక, ఆగ్నేయాసియాలో తెలుగు కేంద్రంగానూ పని చేస్తుండటం అభినందనీయం అన్నారు.

మలేషియా తెలుగు అకాడమీ 4 స్థాయిల్లో అందించే డిప్లమా కోర్సులను రూపొందించడానికి హైదరాబాద్ లోని పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సహకారం అందించటం ఆనందదాయకం అన్నారు.ఇక్కడి కుటుంబాల పిల్లలకు తెలుగు భాషను బోధించడానికి, వారిని తెలుగు సంస్కృతికి వారసులుగా తీర్చిదిద్దడానికి ఈ సంస్థ చేస్తున్న కృషి ముదావహం.

అకాడమీ భవనం సైతం తెలుగు సంస్కృతిని ప్రతిబింబిస్తోందన్నారు. త్రిలింగ దేశాన్ని సూచించే విధంగా మూడు విభాగాలను ఏర్పాటు చేయడం, అందులో ఐదు అంతస్తులను పంచభూతాలకు, 12 పిరమిడ్స్ ను దాతల నక్షత్రాలకు చిహ్నంగా ఏర్పాటు చేయడం చక్కని ఆలోచన. ఇది అకాడమీ కాదు... మలేషియా తెలుగు భాషా మందిరం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com