మలేషియాలో తెలుగు అకాడమీని సందర్శించిన వెంకయ్య నాయుడు
- October 15, 2022
కౌలలంపూర్: మలేసియా తెలుగు సంఘం వారు ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన రావంగ్ లోని మలేషియా తెలుగు అకాడమీని సందర్శించిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు.ఈ విభాగం ద్వారా వారు తెలుగు భాష సంస్కృతి, లలితకళలకు సంబంధించిన విద్యాబోధన చేయడమే గాక, ఆగ్నేయాసియాలో తెలుగు కేంద్రంగానూ పని చేస్తుండటం అభినందనీయం అన్నారు.
మలేషియా తెలుగు అకాడమీ 4 స్థాయిల్లో అందించే డిప్లమా కోర్సులను రూపొందించడానికి హైదరాబాద్ లోని పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సహకారం అందించటం ఆనందదాయకం అన్నారు.ఇక్కడి కుటుంబాల పిల్లలకు తెలుగు భాషను బోధించడానికి, వారిని తెలుగు సంస్కృతికి వారసులుగా తీర్చిదిద్దడానికి ఈ సంస్థ చేస్తున్న కృషి ముదావహం.
అకాడమీ భవనం సైతం తెలుగు సంస్కృతిని ప్రతిబింబిస్తోందన్నారు. త్రిలింగ దేశాన్ని సూచించే విధంగా మూడు విభాగాలను ఏర్పాటు చేయడం, అందులో ఐదు అంతస్తులను పంచభూతాలకు, 12 పిరమిడ్స్ ను దాతల నక్షత్రాలకు చిహ్నంగా ఏర్పాటు చేయడం చక్కని ఆలోచన. ఇది అకాడమీ కాదు... మలేషియా తెలుగు భాషా మందిరం.


తాజా వార్తలు
- ICC T20 World Cup 2026: ఇంగ్లండ్ పై వెస్టిండీస్ విజయం
- నాలుగో అత్యంత విలువైన సంస్థగా SBI
- కెనడా స్కూల్లో కాల్పులు..10 మంది మృతి
- BHELలో 5 శాతం వాటాల విక్రయం..
- పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్: మునిసిపల్ ఎన్నికల్లో ఆ పార్టీ దే హవా!
- తెలంగాణ: మున్సిపల్ పోలింగ్ ముగిసింది
- సామాజిక రక్షణ పథకాల కవరేజ్ గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపి బాలశౌరి
- అమెరికా ప్రభుత్వానికి భారత్ తలొగ్గింది..రాహుల్గాంధీ
- రేపు భారత్ బంద్..
- ఆంధ్రప్రదేశ్: మార్చి 6 వరకు అసెంబ్లీ సమావేశాలు









