మలేషియాలో తెలుగు అకాడమీని సందర్శించిన వెంకయ్య నాయుడు
- October 15, 2022
కౌలలంపూర్: మలేసియా తెలుగు సంఘం వారు ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన రావంగ్ లోని మలేషియా తెలుగు అకాడమీని సందర్శించిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు.ఈ విభాగం ద్వారా వారు తెలుగు భాష సంస్కృతి, లలితకళలకు సంబంధించిన విద్యాబోధన చేయడమే గాక, ఆగ్నేయాసియాలో తెలుగు కేంద్రంగానూ పని చేస్తుండటం అభినందనీయం అన్నారు.
మలేషియా తెలుగు అకాడమీ 4 స్థాయిల్లో అందించే డిప్లమా కోర్సులను రూపొందించడానికి హైదరాబాద్ లోని పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సహకారం అందించటం ఆనందదాయకం అన్నారు.ఇక్కడి కుటుంబాల పిల్లలకు తెలుగు భాషను బోధించడానికి, వారిని తెలుగు సంస్కృతికి వారసులుగా తీర్చిదిద్దడానికి ఈ సంస్థ చేస్తున్న కృషి ముదావహం.
అకాడమీ భవనం సైతం తెలుగు సంస్కృతిని ప్రతిబింబిస్తోందన్నారు. త్రిలింగ దేశాన్ని సూచించే విధంగా మూడు విభాగాలను ఏర్పాటు చేయడం, అందులో ఐదు అంతస్తులను పంచభూతాలకు, 12 పిరమిడ్స్ ను దాతల నక్షత్రాలకు చిహ్నంగా ఏర్పాటు చేయడం చక్కని ఆలోచన. ఇది అకాడమీ కాదు... మలేషియా తెలుగు భాషా మందిరం.


తాజా వార్తలు
- అలర్ట్..పెరగనున్న ఫాస్టాగ్ వార్షిక పాస్ ధరలు!
- రేపటి నుంచి ఆకస్మిక తనిఖీలు చేయనున్న సీఎం చంద్రబాబు
- విజయవాడ హైవే మీద ప్రయాణించే వారికి శుభవార్త
- అక్రమ మందుల అమ్మకాల పై సౌదీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొరడా..!!
- ప్రాంతీయ భద్రత పై కింగ్ హమద్, యూకే రక్షణ మంత్రి చర్చలు..!!
- త్వరలోనే భారత్ కు సెల్వం కృష్ణన్ పార్ధివ దేహం..భారత రాయబారి..!!
- హ్యూమన్ ట్రాఫికింగ్ ను ఇలా గుర్తించండి..గైడ్ లైన్స్ విడుదల చేసిన ఖతార్..!!
- మిడిలీస్టులో యుద్ధ పరిణామాల పై సమావేశం..పాల్గొన్న ఒమన్..!!
- యూఏఈలో ఏప్రిల్ 17 వరకు డిస్టన్స్ లెర్నింగ్ పొడిగింపు..!!
- సమాజ సేవలో 'అర్జాస్ స్టీల్' ముందంజ









