బహ్రెయిన్ సర్ఫింగ్ లెజెండ్ ‘అల్ దోసరి’ మృతి
- October 16, 2022
బహ్రెయిన్ : బహ్రెయిన్ సర్ఫింగ్ లెజెండ్, సర్ఫింగ్ శిక్షకుడు ముహన్నా అల్ దోసరి(33) సముద్ర ప్రమాదంలో మరణించారు. బహ్రెయిన్ సౌత్ కోస్ట్లో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. బీచ్ కల్చర్ WLL వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ అయిన ముహన్నా 2010లో పోర్ట్స్మౌత్ యూనివర్శిటీ నుండి ఎకనామిక్స్, ఫైనాన్స్, బ్యాంకింగ్లో పట్టా పొందిన లెవెల్ 1 IKO సర్టిఫైడ్ కైట్సర్ఫింగ్ ట్రైనర్. 10 సంవత్సరాల వయస్సు నుండి బహ్రెయిన్ జాతీయ సెయిలింగ్ జట్టులో భాగమైన అతను బహ్రెయిన్ బీచ్ క్రీడలలో గుర్తింపు పొందారు. ఈ ప్రాంతంలో సముద్ర పర్యావరణ సుస్థిరతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఆయన కృషి చేశారు. ముహన్నా బహ్రెయిన్ కైట్సర్ఫింగ్ అసోసియేషన్ను స్థాపించడంలో ఆయనది కీలక పాత్ర. అనేక సముద్ర/బీచ్ ఆధారిత కమ్యూనిటీ ఈవెంట్లను విజయవంతంగా నిర్వహించడంలో అల్ దోసరి కీలక భూమిక పోషించారు.
తాజా వార్తలు
- దేశంలోనే తొలి మ్యూజిక్ రోడ్డు ప్రారంభం..
- నిమాయిష్ బహుమతుల ప్రదానోత్సవంలో మంత్రి జూపల్లి కృష్ణారావు
- కొలకలూరి సాహిత్య పురస్కారాలు–2026 విజేతల ప్రకటన
- ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు
- బ్రిటన్ పార్లమెంట్ సభ్యుడిగా సిద్దిపేట యువకుడు
- పవర్ఫుల్ పాస్పోర్టుల జాబితా విడుదల
- మార్చి 1 నుంచి లైసెన్స్ లేనివారి పై కఠిన చర్యలు
- ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, బుడ్డా వెంగళరెడ్డిల సేవలు చిరస్మరణీయం: మంత్రి దుర్గేష్
- గల్ఫ్ ఎయిర్లైన్స్ విమానానికి బాంబు బెదిరింపు మెయిల్
- కమ్యూనిటీ పోలీసింగ్’ ద్వారా ప్రజలతో మమేకం: సైబరాబాద్ సీపీ డాక్టర్ రమేష్









