బహ్రెయిన్ సర్ఫింగ్ లెజెండ్ ‘అల్ దోసరి’ మృతి
- October 16, 2022
బహ్రెయిన్ : బహ్రెయిన్ సర్ఫింగ్ లెజెండ్, సర్ఫింగ్ శిక్షకుడు ముహన్నా అల్ దోసరి(33) సముద్ర ప్రమాదంలో మరణించారు. బహ్రెయిన్ సౌత్ కోస్ట్లో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. బీచ్ కల్చర్ WLL వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ అయిన ముహన్నా 2010లో పోర్ట్స్మౌత్ యూనివర్శిటీ నుండి ఎకనామిక్స్, ఫైనాన్స్, బ్యాంకింగ్లో పట్టా పొందిన లెవెల్ 1 IKO సర్టిఫైడ్ కైట్సర్ఫింగ్ ట్రైనర్. 10 సంవత్సరాల వయస్సు నుండి బహ్రెయిన్ జాతీయ సెయిలింగ్ జట్టులో భాగమైన అతను బహ్రెయిన్ బీచ్ క్రీడలలో గుర్తింపు పొందారు. ఈ ప్రాంతంలో సముద్ర పర్యావరణ సుస్థిరతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఆయన కృషి చేశారు. ముహన్నా బహ్రెయిన్ కైట్సర్ఫింగ్ అసోసియేషన్ను స్థాపించడంలో ఆయనది కీలక పాత్ర. అనేక సముద్ర/బీచ్ ఆధారిత కమ్యూనిటీ ఈవెంట్లను విజయవంతంగా నిర్వహించడంలో అల్ దోసరి కీలక భూమిక పోషించారు.
తాజా వార్తలు
- గుజరాత్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- ఖతార్ ఎమిర్కు యూఏఈ అధ్యక్షుడి స్వాగతం
- రియాద్లో ఘనంగా టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో 5 రోజుల వర్షాలు..ఆరెంజ్ అలర్ట్
- ఏపీలో రేపటి నుండి ఎన్టీఆర్ వైద్యసేవలు బంద్!
- సైబర్ నేరాల నియంత్రణలో బ్యాంకర్లదే కీలక పాత్ర: సీపీ సజ్జనార్
- ఇండిగో కొత్త సీఈవోగా విలియం వాల్ష్
- పార్టనర్షిప్ బలోపేతానికి సౌదీ అరేబియా, కెనడా చర్చలు..!!
- జెరూసలేంలో ఇజ్రాయెల్ ఆంక్షలు..ఖండించిన అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- దుబాయ్ లో కువైట్ ఆయిల్ ట్యాంకర్ పై ఇరాన్ దాడి..!!









