కస్టమర్ల ఫిర్యాదులపై సీపీఏ కొరడా.. RO567,000 రికవరీ
- October 16, 2022
మస్కట్: 2022 జూలై-సెప్టెంబర్ కాలంలో కస్టమర్ల కోసం అర మిలియన్ రియాల్స్ను తిరిగి పొందినట్లు కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CPA) వెల్లడించింది. 2022 మూడవ త్రైమాసికంలో రికవరీ చేయబడిన మొత్తం RO567,132 అని CPA జారీ తెలిపింది. వ్యాపారులపై వినియోగదారులు సమర్పించిన ఫిర్యాదులను పరిష్కరించి, రికవరీలు చేసినట్లు అథారిటీ పేర్కొంది. ఆటోమొబైల్స్ , ఆటో సర్వీసులు, బిల్డింగ్ మెటీరియల్స్, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, ఫర్నిషింగ్లు, ఫర్నీచర్ వర్క్షాప్లతో సహా అధికార పరిధిలోకి వచ్చే అనేక రంగాలలో 8,215 ఫిర్యాదులు, 2,023 ఉల్లంఘనల నివేదికలు అందాయని అథారిటీ వెల్లడించింది. దుకాణాలు, వాణిజ్య కేంద్రాలను తనిఖీ చేయడానికి ఫీల్డ్ వర్క్ టీమ్లను ఏర్పాటు చేయడంతో పాటు సుల్తానేట్లోని అన్ని మార్కెట్లలో అధిక ధరలను అరికట్టేందుకు అధికార యంత్రాంగం స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసిందని CPA అధికారి పేర్కొన్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా సజ్జనార్ బాధ్యతలు
- డొమెస్టిక్ వర్కర్ల నియామకాలపై డిజిటల్ పర్యవేక్షణ..!!
- ఒమన్ టూరిజం..సరికొత్తగా ముసాండం వింటర్ సీజన్..!!
- పోప్ లియో XIV ను కలిసిన సల్మాన్ బిన్ హమద్..!!
- కార్మికులకు సౌదీ శుభవార్త.. స్టేటస్ మార్పునకు అవకాశం..!!
- కువైట్ లో స్మగ్లింగ్ పై ఉక్కుపాదం..!!
- దుబాయ్ లో వికసించిన 150 మిలియన్ల ఫ్లవర్స్..!!
- ట్రంప్ మరో సంచలన నిర్ణయం..
- రెనే హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత గుండె వ్యాధి శిబిరం విజయవంతం..
- TGSRTC నూతన ఎండీగా వై.నాగిరెడ్డి