ఆ 18 మంది పిల్లల మరణానికి హౌతీలే బాధ్యులు
- October 16, 2022
యెమెన్లోని సనాలో గడువు ముగిసిన కీమోథెరపీ ఇంజెక్షన్తో 18 మందికి పైగా చిన్నారుల మరణానికి ఇరాన్ మద్దతుగల హౌతీ మిలీషియా కారణమని యెమెన్ సమాచార మంత్రి మొఅమర్ అల్-ఎర్యానీ ఆరోపించారు. మిలీషియా ఆధీనంలో ఉన్న నగరంలోని ఒక ఆసుపత్రిలో లుకేమియాకు చికిత్స పొందుతున్న పిల్లలకు – కలుషితమైన, నెలల తరబడి హౌతీల గిడ్డంగులలో నిల్వ చేయబడిన కీమోథెరపీ ఇంజెక్షన్లను వినియోగించినట్లు మంత్రి వివరించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), ఇతర సంస్థలు యెమెన్కు విరాళంగా అందించిన కీమోథెరపీ ఇంజెక్షన్లను హౌతీలు ఆసుపత్రులకు పంపిణీ చేశారని అల్-ఎర్యానీ వెల్లడించారు. అయితే, హౌతీలు వాటిని ఆసుపత్రులకు పంపిణీ చేయడానికి ముందు చాలా కాలం పాటు నిల్వ చేశారన్నారు. ఈ మేరకు తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో అల్-ఎర్యానీ స్పష్టం చేశారు. అంతర్జాతీయ సంస్థలు ఉచితంగా అందించే మందులను హౌతీ మిలీషియా అడ్డుకోని వాటిని బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తుందని ఆరోపించారు.
తాజా వార్తలు
- కేంద్ర రోడ్డు నిధి కింద రోడ్డు మరమ్మత్తుల పై ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- పాన్ కార్డు నిబంధనల్లో మార్పులు..ఏప్రిల్ 1 నుంచి అమలు
- ఫిలడెల్ఫియాలో ఘనంగా NATS బాలల సంబరాలు
- నమీబియా పై భారత్ భారీ స్కోరు
- ప్రపంచంలోనే మొట్టమొదటి 24 గంటల స్టేడియం స్పోర్ట్స్ హాకథాన్కు ఆతిథ్యం వహించనున్న తెలంగాణ
- NTRకు భారతరత్న ఇవ్వాలి: సీఎం రేవంత్
- దేశంలోనే తొలి మ్యూజిక్ రోడ్డు ప్రారంభం..
- నిమాయిష్ బహుమతుల ప్రదానోత్సవంలో మంత్రి జూపల్లి కృష్ణారావు
- కొలకలూరి సాహిత్య పురస్కారాలు–2026 విజేతల ప్రకటన
- ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు









