ఆ 18 మంది పిల్లల మరణానికి హౌతీలే బాధ్యులు
- October 16, 2022
యెమెన్లోని సనాలో గడువు ముగిసిన కీమోథెరపీ ఇంజెక్షన్తో 18 మందికి పైగా చిన్నారుల మరణానికి ఇరాన్ మద్దతుగల హౌతీ మిలీషియా కారణమని యెమెన్ సమాచార మంత్రి మొఅమర్ అల్-ఎర్యానీ ఆరోపించారు. మిలీషియా ఆధీనంలో ఉన్న నగరంలోని ఒక ఆసుపత్రిలో లుకేమియాకు చికిత్స పొందుతున్న పిల్లలకు – కలుషితమైన, నెలల తరబడి హౌతీల గిడ్డంగులలో నిల్వ చేయబడిన కీమోథెరపీ ఇంజెక్షన్లను వినియోగించినట్లు మంత్రి వివరించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), ఇతర సంస్థలు యెమెన్కు విరాళంగా అందించిన కీమోథెరపీ ఇంజెక్షన్లను హౌతీలు ఆసుపత్రులకు పంపిణీ చేశారని అల్-ఎర్యానీ వెల్లడించారు. అయితే, హౌతీలు వాటిని ఆసుపత్రులకు పంపిణీ చేయడానికి ముందు చాలా కాలం పాటు నిల్వ చేశారన్నారు. ఈ మేరకు తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో అల్-ఎర్యానీ స్పష్టం చేశారు. అంతర్జాతీయ సంస్థలు ఉచితంగా అందించే మందులను హౌతీ మిలీషియా అడ్డుకోని వాటిని బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తుందని ఆరోపించారు.
తాజా వార్తలు
- ఇరాన్ దాడులతో గల్ఫ్ దేశాలను రెచ్చగొడుతుంది..!!
- రక్షణ సహకారం పై ఖతార్ ప్రధాని, యూకే రక్షణ కార్యదర్శి చర్చలు..!!
- గుజరాత్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- ఖతార్ ఎమిర్కు యూఏఈ అధ్యక్షుడి స్వాగతం
- రియాద్లో ఘనంగా టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో 5 రోజుల వర్షాలు..ఆరెంజ్ అలర్ట్
- ఏపీలో రేపటి నుండి ఎన్టీఆర్ వైద్యసేవలు బంద్!
- సైబర్ నేరాల నియంత్రణలో బ్యాంకర్లదే కీలక పాత్ర: సీపీ సజ్జనార్
- ఇండిగో కొత్త సీఈవోగా విలియం వాల్ష్
- పార్టనర్షిప్ బలోపేతానికి సౌదీ అరేబియా, కెనడా చర్చలు..!!









