దీపావళికి ముందే ఢిల్లీలో పడిపోయిన ఎయిర్ క్వాలిటీ
- October 22, 2022
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం క్రమంగా మళ్లీ పెరుగుతోంది. దీపావళి కన్నా ముందే ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ పడిపోయిందని అధికారులు తెలిపారు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 262కు చేరిందన్నారు. ఇవాళ AQI 300 మార్క్ దాటే అవకాశం ఉందని ఎయిర్ క్వాలిటీ మేనేజ్ మెంట్ కమిషన్ అంచనా వేస్తోంది. ఈరోజు ఉదయం ఢిల్లిలోని ఇండియా గేట్ సమీపంలో పొగ మంచు కమ్మేసింది. ఎయిర్ క్వాలిటీ మేనేజ్ మెంట్ ఆదేశాలను అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీనిపై ప్రభుత్వం అప్రమత్తంగా ఉందన్నారు. కాలుష్యాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పొల్యూషన్ దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వం దీపావళికి పటాకులు కాల్చడంపై నిషేధం విధించింది. పటాకులు తయారుచేసినా, అమ్మినా రూ. 200 నుంచి రూ.5 వేల వరకు జరిమానా విధించనున్నట్లు ఆప్ ప్రభుత్వం ప్రకటించింది. జరిమానాతో పాటు 6 నెలలు జైలు శిక్ష విధించనున్నట్లు ప్రకటించింది.
తాజా వార్తలు
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు
- యూఏఈలో భారతీయ పాస్పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా







