కేటీఆర్ సమక్షంలో ‘టీఆర్ఎస్’లో చేరిన డాక్టర్ రవికుమార్ పనస
- October 22, 2022
హైదరాబాద్: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సమక్షంలో డాక్టర్ రవికుమార్ పనస తెలంగాణ/భారత రాష్ట్ర సమితి (T/BRS) పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ కుండువా కప్పి పార్టీలోకి స్వాగతించారు. సరైన సమయంలో సరైనా నిర్ణయం తీసుకున్నారని.. రాష్ట్రంలో గొప్ప విప్లవాత్మక మార్పు ప్రారంభమైందని కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. భవిష్యత్ ఆచరణలు, ఆదర్శ దార్శనిక ఆలోచనలతో మార్పు ప్రారంభమైందని కేటీఆర్ అన్నారు.
ఈ సందర్భంగా రవి పనస మాట్లాడుతూ.. కేటీఆర్ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చానన్నారు. కేటీఆర్ భాషా నైపుణ్యం, నాయకత్వం, చేసే పనిలో స్పష్టతపై ప్రశంసలు కురిపించారు. అధికారికంగా గులాబీ దళంలో భాగం కావడం సంతోషంగా ఉందన్నారు.
రవి కుమార్ పనస ఫిల్మ్ మ్యాగజైన్ ఎడిటర్గా తన కెరీర్ను ప్రారంభించి.. PRO, ఈవెంట్ ఆర్గనైజర్, లిక్కర్ బిజినెస్, రియల్ ఎస్టేట్ రంగంలో విశేషంగా రాణిస్తున్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 500 ఎకరాలకు పైగా వెంచర్లను రవికుమార్ ఆధ్వర్యంలో విజయవంతంగా పూర్తి చేశారు. ఇటీవలే సినీ నిర్మాణ రంగంలోకి ప్రవేశించి స్వంత బ్యానర్ను ప్రారంభించారు.
తాజా వార్తలు
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు
- యూఏఈలో భారతీయ పాస్పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా







