72 మిలియన్ గ్యాలన్ల రెయిన్ వాటర్ తొలగింపు..!!
- December 20, 2025
దోహా: ఖతార్ లో భారీ వర్షాల కారణంగా నిల్వఉన్న వరద నీటిని తొలగించేందుకు మున్సిపల్, పబ్లిక్ వర్క్స్ అథారిటీ (అష్ఘల్) సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు ఇతర సంస్థలతో కూడిన జాయింట్ రెయిన్ ఎమర్జెన్సీ కమిటీ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించింది.
ఈ సందర్భంగా మొత్తం 72 మిలియన్ గ్యాలన్ల వరద నీటిని తొలగించింది. 544 ట్యాంకర్లు మరియు 36 పంపులను ఉపయోగించి 12,191 ట్రిప్పులలో నీటిని తొలగించారు. వివిధ సంబంధిత ఏజెన్సీల నుండి మొత్తం 813 మంది ఉద్యోగులు, కార్మికులు ఈ ప్రయత్నాలలో పాల్గొన్నారని అథారిటీ తెలిపింది.
మునిసిపాలిటీ మంత్రిత్వ శాఖ కాల్ సెంటర్ కు వరద నీటి లాగ్ లకు సంబంధించిన 1,452 ఫిర్యాదులను అందుకుంది. వర్షాలతో ప్రభావితమైన అన్ని మునిసిపాలిటీలలో ప్రజా సౌకర్యాల భద్రతను నిర్ధారించడానికి నిరంతర పర్యవేక్షణతో సిబ్బంది సన్నద్ధంగా ఉన్నారని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!
- సౌదీలో జూలైలో 1.8 శాతానికి ద్రవ్యోల్బణం..!!
- ఖతార్లో వేసవి పనివేళలపై కార్మిక శాఖ కీలక ప్రకటన..!!
- ఎలక్ట్రానిక్ రికార్డుల తారుమారు కేసులో విచారణ..!!
- సమైల్లో ఇంధన స్టేషన్లో వాహనానికి మంటలు..!!
- విజయ్ సీఎం అయ్యాక రూ. లక్ష కోట్ల పెట్టుబడులు- TN CMO
- ప్రత్యామ్నాయ రవాణా మార్గాలపై కువైట్ ఫోకస్..!!
- దుబాయ్లో ‘Rent Now, Pay Later’ సేవ.. 12 నెలల వరకు వడ్డీ లేని వాయిదాలు
- మహబూబ్నగర్లో బ్రహ్మోస్ మిస్సైల్ తయారీ యూనిట్
- ఖతార్లో మెత్రాష్ యూజర్లకు కీలక సర్వీస్..!!







