దుకాణాలు, మాల్స్లో దీపావళి సందడి
- October 23, 2022
యూఏఈ: భారతీయ ‘వెలుగుల పండుగ’ దీపావళి వేడుకలు గల్ఫ్ లో ఘనంగా జరుగుతున్నాయి. దుకాణాలు, మాల్స్ ప్రవాసులతో సందడిగా ఉన్నాయి. ముఖ్యంగా ఆభరణాల దుకాణాలు ధన్తేరస్ను పురస్కరించుకొని రద్దీ నెలకొంది. దాదాపు రెండేళ్ల తర్వాత దీపావళి పండుగకు ఇంత మంది కస్టమర్లను చూడటం సంతోషంగా ఉందని పలువురు అభరణాల దుకాణం దారులు సంతోషం వ్యక్తం చేశారు. సాధారణ రోజులకంటే 50-75 శాతం ఎక్కువ మంది కస్టమర్ర్లు దీపావళి పండుగ వేళలో వస్తున్నారని చెబుతున్నారు. మరోవైపు బంగారం ధర 184.50 దిర్హాలకు పడిపోవడంతో కోనుగోళ్లు పెరిగాయని అబుధాబిలోని అజంతా జ్యువెలర్స్ మేనేజింగ్ డైరెక్టర్ తుషార్ పాట్నీ తెలిపారు. అబుధాబిలోని మజ్యాద్ మాల్లోని అతిపెద్ద షోరూమ్ అయిన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ రోజంతా కొనుగోలుదారులతో కిటకిటలాడింది. ధంతేరస్, దీపావళిని దృష్టిలో ఉంచుకుని, గత నెలలో మేము ముందస్తు చెల్లింపు పథకాన్ని ప్రారంభించామని, ప్రతి Dh3,000 విలువైన కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా అందిస్తున్నామని బ్రాంచ్ మేనేజర్ అరుణ్ కుమార్ తెలిపారు. మరోవైపు షాపింగ్ మాల్స్, షాపులన్నీంటిని రంగురంగుల దీపాలతో అలకరించారు. అబుధాబిలోని మదీనాత్ జాయెద్ షాపింగ్ సెంటర్ వారాంతంలో లులు 'దీపావళి మేళా'లో భాగంగా నిర్వహించిన సంగీతం, నృత్యం, ఫుడ్ స్టాల్స్ ప్రవాసులతో నిండిపోయింది. అబుధాబిలోని రీమ్ ఐలాండ్లోని 200 మందికి పైగా కమ్యూనిటీ సభ్యులు శనివారం సాయంత్రం నిర్వహించిన దీపావళి కార్యక్రమాల్లో పాల్గొన్నారని నివాసి అనిల్ కుమార్ కేజ్రీవాల్ వివరించారు.
తాజా వార్తలు
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు
- యూఏఈలో భారతీయ పాస్పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా







