గల్ఫ్ కార్మికుని మృతదేహానికి గన్ పార్క్ వద్ద నివాళి

- October 22, 2022 , by Maagulf
గల్ఫ్ కార్మికుని మృతదేహానికి గన్ పార్క్ వద్ద నివాళి

హైదరాబాద్: సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం ధర్మాజీపేట గ్రామానికి చెందిన జనగామ నర్సయ్య ఇటీవల బహరేన్ లో మరణించారు.శనివారం, (22.10.2022) బహ్రెయిన్ నుంచి హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న మృతదేహాన్ని గల్ఫ్ జెఏసి నాయకులు, మృతుని కుటుంబ సభ్యులు కలిసి హైదరాబాద్ లోని అమరవీరుల స్తూపం, గన్ పార్క్ వద్ద శవపేటిక ను ఉంచి నివాళులు అర్పించారు. 

అరుణోదయ సాంస్కృతిక బృందం గల్ఫ్ అమరులకు నివాళులు అర్పిస్తూ పాటలు పాడారు.తెలంగాణ బిజెపి గల్ఫ్ మిడిల్ ఈస్ట్ కన్వీనర్ డా. నరేంద్ర పన్నీరు, గల్ఫ్ జెఏసి రాష్ట్ర అధ్యక్షులు గుగ్గిల్ల రవిగౌడ్, తెలంగాణ గల్ఫ్ కాంగ్రెస్ అధ్యక్షులు సింగిరెడ్డి నరేష్ రెడ్డి, గల్ఫ్ జెఏసి రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగుల మురళీధర్ రెడ్డి, ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు స్వదేశ్ పరికిపండ్ల, సిఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ చెన్నమనేని శ్రీనివాసరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ప్రసంగించిన డా.నరేంద్ర పన్నీరు రూ.500 కోట్ల వార్షిక బడ్జెట్ తో గల్ఫ్ బోర్డు తో కూడిన సమగ్ర ప్రవాసీ విధానం ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి గత ఎనిమిది ఏళ్లలో 1,600 మంది తెలంగాణ కార్మికులు గల్ఫ్ దేశాలలో మృతి చెందారని, కేసీఆర్ ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి గల్ఫ్ మృతుని కుటుంబానికి రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు.

--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com