మహేష్బాబుకీ, ‘కేజీఎఫ్కీ లింకు పెట్టేస్తారా.?
- October 26, 2022
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ అయిపోయింది.
సెకండ్ షెడ్యూల్ కోసం టీమ్ సర్వం సిద్ధం చేస్తోంది. ఈ లోపు ఈ సినిమాకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ తాజాగా చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో విలన్ రోల్ కోసం ఓ బాలీవుడ్ సీనియర్ హీరోతో సంప్రదింపులు జరుగుతున్నాయంటూ గాచిప్ గుసగుసలాడుతోంది.
ఆయన మరెవరో కాదు, బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్. ఆల్రెడీ ఈయన ‘కేజీఎఫ్’ సినిమాతో సౌత్ సినిమాల్ని టచ్ చేశాడు. అంతేకాదు, మరిన్ని సౌత్ సినిమాల్లో మరీ ముఖ్యంగా తెలుగు సినిమాల్లో నటించాలని వుందంటూ తన మనసులోని మాటను ఇటీవలే బయట పెట్టిన సంగతి తెలిసిందే.
సో, ఆయన కోరిక ఇంత త్వరగానే తీరపోతుందా.? అంటే, అవుననే అనాలేమో. త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ కోసం సంజయ్ దత్నే విలన్గా ఎంచుకోవాలనుకుంటున్నారనీ తెలుస్తోంది. ఒకవేళ అదే జరిగితే, ఇప్పటికే ఈ సినిమాపై వున్న అంచనాలు.. మరింత రెట్టింపయ్యే అవకాశాలున్నాయ్. బుట్టబొమ్మ పూజా హెగ్దే ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..
- 'బెల్ ఆఫ్ ఆర్మ్స్', 'సారథి' సెంట్రల్ వర్క్షాప్ను ప్రారంభించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- మా కృషి వల్లే జిందాల్ స్టీల్ నిర్మాణం: జగన్
- షార్జా ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల కాన్సులర్ అటెస్టేషన్ సేవలు
- గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన పవన్ కల్యాణ్
- దేశంలోనే తొలిసారి.. విమానాన్ని వేలం వేసిన ED..
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!







