ఫోన్ లో మాట్లాడటం మాని...ఆ పై రోడ్డు దాటు
- April 20, 2016
' సురక్షితంగా రోడ్ దాటటానికి ఫోన్ ని విడిచిపెట్టు ' అజమాన్ పోలీస్ ఒక ప్రచారం మొదలుపెట్టారు. సమాచారం మరియు ప్రజా సంబంధాల శాఖ సహకారంతో ట్రాఫిక్ జనరల్ డైరెక్టరేట్ ప్రారంభించారు.లెఫ్టినెంట్ కల్నల్ డైరెక్టర్, ట్రాఫిక్ , పెట్రోలింగ్ శాఖ , అజమాన్ పోలీస్ ఆలీ హుమిడ్ అల్ ముసైబి మాట్లాడుతూ, తరలింపు ప్రమాదాలను నివారించడానికి రోడ్డు దాటే సమయంలో పాదచారులకు పూర్తిగా రోడ్లపై దృష్టి నిర్ధారించే లక్ష్యంతో ఉండాలని చెప్పారు.అలాగే "గత ఏడాది , రోడ్లు దాటే సమయంలో పరుగులు పెడ్తూ ప్రమాదాలు గురైనవారు 102 మందని ఈ బాధితులలో అనేకమంది మొబైల్ ఫోన్లను ఆ సమయంలో వాడుతున్నట్లు తేలిందన్నారు." రహదారులు దాటే వేళలో వారికి ఏకాగ్రత లేకపోవడం ఒక ముఖ్య కారణం." పాదచారులు ప్రమాదాలను నివారించడానికి, తప్పక ట్రాఫిక్ నియమాలు గౌరవించాలని కేవలం వాహనదారులు పాటిస్తే సరిపోదని " అన్నారాయన. ప్రచారంలో భాగంగా ఈ ప్రకటనలను పాఠశాలలు మరియు విద్యాలయాల్లో పంపిణీ చేస్తారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







