నవంబర్ 3న జాతీయ జెండాను ఎగురవేయాలి..షేక్ మహమ్మద్ పిలుపు

- October 28, 2022 , by Maagulf
నవంబర్ 3న జాతీయ జెండాను ఎగురవేయాలి..షేక్ మహమ్మద్ పిలుపు

యూఏఈ: అన్ని మంత్రిత్వ శాఖలు, సంస్థలు నవంబర్ 3న ఉదయం 11 గంటలకు జాతీయ జెండాను ఎగురవేయాలని యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు షేక్ మహ్మద్ ట్వీట్ చేశారు. ‘‘వచ్చే నవంబర్ 3న మన దేశం జెండా దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఆ రోజు ఉదయం 11 గంటలకు మా మంత్రిత్వ శాఖలు, సంస్థలన్నీ జాతీయ జెండాను ఎగురవేయాలి.’’ అని తన ట్వీట్ లో షేక్ మహమ్మద్ పిలుపునిచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com