దక్షిణకొరియాలో తీవ్ర విషాదం.. తొక్కిసలాటలో 151 మంది మృతి
- October 30, 2022
సియోల్: దక్షిణ కొరియా రాజధాని సియోల్లో ఘోరం సంభవించింది. ప్రతీ ఏడాది జరిగే హాలోవీన్ వేడుకల్లో ఈ సారి అపశ్రుతి చోటు చేసుకుంది. నగరంలోని ఒక ఇరుకైన వీధిలో ఒక్కసారిగా వందలాది మంది ప్రజలు రావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. దీంతో 151 మంది మృతి చెందినట్లు నగర ఫైర్ డిపార్ట్మెంట్ ప్రకటించింది. ఒకేసారి భారీ ఎత్తున ప్రజలు రావడం, భయభ్రాంతులకు గురైన వాళ్లు కంగారుగా పరుగులు తీయడానికి ప్రయత్నించడంతో చాలా మంది కిందపడ్డారు. వెనుక వస్తున్న వాళ్లు ఏం జరుగుతుందో తెలియక.. కింద పడిన వారి మీద నుంచి పరుగులు తీశారు.
చాలా మంది కింద పడిన తర్వాత గుండె పోటుతో మృత్యువాత పడ్డారని సియోల్ ఫైర్ డిపార్ట్మెంట్ చీఫ్ చోయ్ సియాంగ్ బియోమ్ తెలియజేశారు. మృతి చెందిన వారిలో 19 మంది విదేశీయలు కూడా ఉన్నారని.. అయితే ఎవరు ఏ దేశానికి చెందిన వారో ఇంకా తెలియరాలేదని ఆయన చెప్పారు. 19 మంది తీవ్రంగా గాయపడ్డారని.. దీంతో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. ఈ తొక్కిసలాటలో మరో 150 మందికి పైగా గాయపడినట్లుగా కూడా చెప్పారు. సంఘటన గురించి తెలుసుకున్న సౌత్ కొరియా ప్రెసిడెంట్ యూన్ సుక్ ఇయోల్ విచారం వ్యక్తం చేశారు. ఇవ్వాళ (ఆదివారం) జాతీయ సంతాప దినంగా ప్రకటించారు.
తాజా వార్తలు
- ఎస్ఆర్హెచ్ పై బెంగళూరు ఘన విజయం
- ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యం..‘టీచ్ ఫర్ ఛేంజ్’
- ఏపీలో బంగారు గనుల తవ్వకాలకు సర్వం సిద్ధం
- మిడిలీస్టులోని క్లాస్ బోర్డ్ పరీక్షల కోసం ప్రత్యామ్నాయ అసెస్మెంట్ స్కీమ్..!!
- ఖతార్ లో భద్రతా సిబ్బందికి సహకరించాలని పిలుపు..!!
- కువైట్ విమానాశ్రయంపై డ్రోన్ అటాక్స్.. దెబ్బతిన్న రాడార్ వ్యవస్థ..!!
- బహ్రెయిన్లోని రిటైల్ అవుట్లెట్లలో తనిఖీలు..దుకాణం మూసివేత..!!
- ఫోటోలు, వీడియోలు తీయడం పై సౌదీ అరేబియా హెచ్చరికలు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన యూఏఈ, ఉక్రెయిన్ ప్రెసిడెండ్స్..!!
- డాలర్తో రూపాయి చారిత్రక పతనం









