షార్జా టాక్సీలో 65% పెరిగిన హైబ్రిడ్ వాహనాలు
- October 30, 2022
షార్జా: ఇంధనం, విద్యుత్ రెండింటిలోనూ పనిచేసే హైబ్రిడ్ వెహికల్ ఫ్లీట్ కార్ల సంఖ్యను పెంచాలని షార్జా టాక్సీ, షార్జా ప్రభుత్వ పెట్టుబడి విభాగం, షార్జా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అనుబంధ సంస్థలు నిర్ణయించాయి. ముఖ్యంగా తూర్పు ప్రాంతంలో షార్జా టాక్సీ తన వాహన సముదాయంలో 65% వరకు హైబ్రిడ్ వాహనాలను చేర్చింది. దీంతో కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించినట్లు షార్జా టాక్సీ పేర్కొంది. కంపెనీ మొత్తం కార్ల సముదాయంలో 100% హైబ్రిడ్ వాహనాలను చేర్చేడమే తమ లక్ష్యంగా పెట్టుకున్నట్లు షార్జా టాక్సీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఖలీద్ అల్ కిండి తెలిపారు. షార్జా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, షార్జా సిటీలో పనిచేస్తున్న షార్జా టాక్సీ ఫ్లీట్లో 60% ప్రస్తుత సంవత్సరం చివరి నాటికి పర్యావరణ అనుకూల హైబ్రిడ్ వాహనాలుగా మార్చాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యం..‘టీచ్ ఫర్ ఛేంజ్’
- ఏపీలో బంగారు గనుల తవ్వకాలకు సర్వం సిద్ధం
- మిడిలీస్టులోని క్లాస్ బోర్డ్ పరీక్షల కోసం ప్రత్యామ్నాయ అసెస్మెంట్ స్కీమ్..!!
- ఖతార్ లో భద్రతా సిబ్బందికి సహకరించాలని పిలుపు..!!
- కువైట్ విమానాశ్రయంపై డ్రోన్ అటాక్స్.. దెబ్బతిన్న రాడార్ వ్యవస్థ..!!
- బహ్రెయిన్లోని రిటైల్ అవుట్లెట్లలో తనిఖీలు..దుకాణం మూసివేత..!!
- ఫోటోలు, వీడియోలు తీయడం పై సౌదీ అరేబియా హెచ్చరికలు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన యూఏఈ, ఉక్రెయిన్ ప్రెసిడెండ్స్..!!
- డాలర్తో రూపాయి చారిత్రక పతనం
- ఐపీఎల్ బెట్టింగ్ పై సీపీ సజ్జనార్ సీరియస్ వార్నింగ్









