‘ఖేద్మా’ ద్వారా ట్రాఫిక్ జరిమానాల చెల్లింపు సేవలు
- November 02, 2022
మస్కట్: ఒమన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్స్ కంపెనీ ‘ఖేద్మా’ ప్లాట్ఫారమ్ ద్వారా అనేక వాహన సంబంధిత సేవలను అందించడానికి సంబంధించి ఒక ఒప్పందంపై రాయల్ ఒమన్ పోలీస్ (ROP) సంతకం చేసింది. పౌరులకు, నివాసితులకు ఒకే విధంగా సేవలను అందించడానికి ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థల మధ్య భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడంలో ఈ ఒప్పందం భాగమని ఆర్ఓపీ పేర్కొంది. ఒప్పందంపై అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఫైనాన్షియల్ అఫైర్స్( ROP) మేజర్ జనరల్ ఖలీఫా బిన్ అలీ అల్ సియాబీ, ఒమన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్స్ కంపెనీ సీఈఓ సెయిడ్ బిన్ అహ్మద్ సఫ్రార్ సంతకం చేశారు. ఒప్పందం మొదటి దశలో ఖేద్మా ట్రాఫిక్ ఉల్లంఘన జరిమానాలు, ముల్కియా ప్రింటింగ్ సేవల చెల్లింపు సేవలను అందిస్తుందని ఆర్ఓపీ తెలిపింది. ఒమన్లోని 68 శాఖలు, బిల్లు చెల్లింపు యంత్రాలు, ఖేద్మా యాప్, కంపెనీ వెబ్సైట్తో సహా ఖేద్మా వివిధ ఛానెల్ల ద్వారా ఈ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయన్నారు.
తాజా వార్తలు
- వాట్సాప్కు ధీటైన స్వదేశీ యాప్!
- భవిష్యత్తు అంతా AI: సీఎం చంద్రబాబు
- కూలిన మిలిటరీ హెలికాప్టర్: ఆరుగురు మృతి
- ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమరం!
- యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో కీలక పరిణామం..
- గల్ఫ్లో ఇరాన్ ప్రతీకారం..అమెరికా రాడార్ వ్యవస్థలు ధ్వంసం
- ఇరాన్ దాడులు..పబ్లిక్ హెల్త్ పై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన..!!
- పిల్లిని రక్షించడానికి ప్రాణాలను పణంగా పెట్టిన వ్యక్తి..!!
- దమ్మామ్ మీదుగా కైరోకు.. కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- వెహికల్ నాయిస్ లిమిట్స్, మోడిఫికేషన్ పై హెచ్చరిక జారీ..!!









