‘ఖేద్మా’ ద్వారా ట్రాఫిక్ జరిమానాల చెల్లింపు సేవలు
- November 02, 2022
మస్కట్: ఒమన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్స్ కంపెనీ ‘ఖేద్మా’ ప్లాట్ఫారమ్ ద్వారా అనేక వాహన సంబంధిత సేవలను అందించడానికి సంబంధించి ఒక ఒప్పందంపై రాయల్ ఒమన్ పోలీస్ (ROP) సంతకం చేసింది. పౌరులకు, నివాసితులకు ఒకే విధంగా సేవలను అందించడానికి ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థల మధ్య భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడంలో ఈ ఒప్పందం భాగమని ఆర్ఓపీ పేర్కొంది. ఒప్పందంపై అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఫైనాన్షియల్ అఫైర్స్( ROP) మేజర్ జనరల్ ఖలీఫా బిన్ అలీ అల్ సియాబీ, ఒమన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్స్ కంపెనీ సీఈఓ సెయిడ్ బిన్ అహ్మద్ సఫ్రార్ సంతకం చేశారు. ఒప్పందం మొదటి దశలో ఖేద్మా ట్రాఫిక్ ఉల్లంఘన జరిమానాలు, ముల్కియా ప్రింటింగ్ సేవల చెల్లింపు సేవలను అందిస్తుందని ఆర్ఓపీ తెలిపింది. ఒమన్లోని 68 శాఖలు, బిల్లు చెల్లింపు యంత్రాలు, ఖేద్మా యాప్, కంపెనీ వెబ్సైట్తో సహా ఖేద్మా వివిధ ఛానెల్ల ద్వారా ఈ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయన్నారు.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్బోర్డ్పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







