పర్యాటకులు, విజిటర్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న యూఏఈ
- November 03, 2022
యూఏఈ: పర్యాటకులు, విజిటర్లకు సంబంధించి యూఏఈ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఓవర్స్టేకు విధించే జరిమానాను సగానికి తగ్గించింది.ఇంతకు ముందు రోజుకు 100 దిర్హాములుగా ఉన్న ఈ జరిమానాను ఇప్పుడు 50 దిర్హాములుగా చేసింది.ఈ మేరకు ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజెన్షిప్, కస్టమ్స్ అండ్ పోస్ట్ సెక్యూరిటీ ప్రకటన చేసింది.ఇక పై పర్యాటకులు, విజిటర్లు ఓవర్స్టేకు పర్ డే 50 దిర్హాములు చెల్లిస్తే సరిపోతుందని తన ప్రకటనలో పేర్కొంది.
ఈ సందర్భంగా ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజెన్షిప్, కస్టమ్స్ మరియు పోస్ట్ సెక్యూరిటీ(ICP) మరో కీలక ప్రకటన చేసింది.వీసా విధానంలో కొత్త సవరణల ప్రకారం విదేశీ నివాసితుల ఓవర్స్టే జరిమానాను రోజుకు 25 దిర్హాములు నుండి 50 దిర్హాములకు పెంచినట్లు ప్రకటించింది.కేబినెట్ రిజల్యూషన్ నం.65 ఆఫ్ 2022 ప్రకారం జరిమానాలను సవరించినట్లు పేర్కొంది.ఇక ఈ జరిమానాల చెల్లింపులను కూడా సులభతరం చేసినట్లు వెల్లడించింది. దేశంలోని ఏ ప్రాంతం నుంచైనా ఎలక్ట్రానిక్ సర్వీసుల ద్వారా చాలా సులభంగా జరిమానాలు చెల్లించే వెసులుబాటు కల్పించినట్లు ఐసీపీ తెలిపింది.
తాజా వార్తలు
- టీమిండియా ఐర్లాండ్ పర్యటన ఖరారు..షెడ్యూల్ ఇదే!
- భారత దేశవ్యాప్తంగా ఘనంగా రంజాన్ వేడుకలు..
- యుద్ధం ముగిసేందుకు అమెరికా మిత్రదేశాలు సహాయపడాలి: సయ్యద్ బదర్
- అమెరికాకు శ్రీలంక బిగ్ షాక్
- ఇరాన్ దాడుల పై జీసీసీ మానవ హక్కుల సంస్థల అత్యవసర సమావేశం..!!
- హోర్ముజ్ జలసంధి పై పలు దేశాల సంయుక్త ప్రకటన..!
- 118 మంది బిచ్చగాళ్లను అరెస్టు చేసిన అబుదాబి పోలీసులు..!!
- కువైట్ గోల్డ్ మార్కెట్లో తగ్గిన ఈద్ సందడి ..!!
- భద్రతా దళాల అప్రమత్తతను ప్రశంసించిన సౌదీ మినిస్టర్..!!
- లెజెండరీ యాక్షన్ స్టార్ చక్ నోరిస్ కన్నుమూత!









