పర్యాటకులు, విజిటర్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న యూఏఈ
- November 03, 2022
యూఏఈ: పర్యాటకులు, విజిటర్లకు సంబంధించి యూఏఈ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఓవర్స్టేకు విధించే జరిమానాను సగానికి తగ్గించింది.ఇంతకు ముందు రోజుకు 100 దిర్హాములుగా ఉన్న ఈ జరిమానాను ఇప్పుడు 50 దిర్హాములుగా చేసింది.ఈ మేరకు ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజెన్షిప్, కస్టమ్స్ అండ్ పోస్ట్ సెక్యూరిటీ ప్రకటన చేసింది.ఇక పై పర్యాటకులు, విజిటర్లు ఓవర్స్టేకు పర్ డే 50 దిర్హాములు చెల్లిస్తే సరిపోతుందని తన ప్రకటనలో పేర్కొంది.
ఈ సందర్భంగా ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజెన్షిప్, కస్టమ్స్ మరియు పోస్ట్ సెక్యూరిటీ(ICP) మరో కీలక ప్రకటన చేసింది.వీసా విధానంలో కొత్త సవరణల ప్రకారం విదేశీ నివాసితుల ఓవర్స్టే జరిమానాను రోజుకు 25 దిర్హాములు నుండి 50 దిర్హాములకు పెంచినట్లు ప్రకటించింది.కేబినెట్ రిజల్యూషన్ నం.65 ఆఫ్ 2022 ప్రకారం జరిమానాలను సవరించినట్లు పేర్కొంది.ఇక ఈ జరిమానాల చెల్లింపులను కూడా సులభతరం చేసినట్లు వెల్లడించింది. దేశంలోని ఏ ప్రాంతం నుంచైనా ఎలక్ట్రానిక్ సర్వీసుల ద్వారా చాలా సులభంగా జరిమానాలు చెల్లించే వెసులుబాటు కల్పించినట్లు ఐసీపీ తెలిపింది.
తాజా వార్తలు
- 98% మురుగునీటి శుద్ధి..పునర్వినియోగంలో అష్ఘల్ విజయం..!!
- బహ్రెయిన్ వాసులకు వీసా రహిత షెంజెన్ ప్రయాణం..జర్మనీ కృషి..!!
- అల్-అహ్మదీలో స్పెషల్ డ్రైవ్..8 దుకాణాలు సీజ్..!!
- ఒమన్ లో చేపల ధరలపై పర్యవేక్షణ బలోపేతం..!!
- సౌదీలో 385 మందిపై విచారణ, 130 మంది అరెస్టు..!!
- సోషల్ మీడియాలో సమ్మర్ ట్రావెల్ ప్లాన్స్ షేరింగ్.. అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- జూలై 8 నుంచి మారనున్న విమాన సర్వీసులు
- శంషాబాద్ ఎయిర్పోర్టులో 20 మంది మహిళలు అరెస్ట్
- ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్ ఫౌండర్ మహమ్మద్ అలీ అలబ్బర్
- ఈ లవ్ ప్రమాదకరం..ఎంపైర్ స్టేట్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్







