వడ్డీ రేటును 75 బేసిస్ పాయింట్లు పెంచిన యూఏఈ, సౌదీ సెంట్రల్ బ్యాంకులు
- November 03, 2022
యూఏఈ: ఓవర్నైట్ డిపాజిట్ ఫెసిలిటీ (ODF)కి వర్తించే బేస్ రేటును 75 బేసిస్ పాయింట్లు పెంచాలని యూఏఈ సెంట్రల్ బ్యాంక్ (CBUAE) నిర్ణయించింది. దీంతో వడ్డిరేట్లు 3.15% నుండి 3.90%కి చేచాయి. పెరిగిన వడ్డిరేట్లు నవంబర్ 3 నుండి అమలులోకి రానున్నాయి. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ బోర్డ్ నవంబర్ 2న రిజర్వ్ బ్యాలెన్స్లపై (IORB) వడ్డీని 75 బేసిస్ పాయింట్లు పెంచుతూ చేసిన ప్రకటన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా, CBUAE అన్ని స్టాండింగ్ క్రెడిట్ సౌకర్యాల ద్వారా స్వల్పకాలిక లిక్విడిటీని రుణం తీసుకోవడానికి వర్తించే రేటును బేస్ రేటు కంటే 50 బేసిస్ పాయింట్ల వద్ద కొనసాగించాలని నిర్ణయించింది.
వడ్డీ రేటును పెంచిన సౌదీ సెంట్రల్ బ్యాంక్
ద్రవ్య, ఆర్థిక స్థిరత్వాన్ని కొనసాగించాలనే లక్ష్యానికి అనుగుణంగా సౌదీ సెంట్రల్ బ్యాంక్.. వడ్డీ రేట్ల రేటును 75 బేసిస్ పాయింట్లు పెంచి 4.5 శాతానికి చేసింది. దీంతో రివర్స్ రెపో రేటు 75 బేసిస్ పాయింట్లు పెరిగి 4.00 శాతానికి చేరింది.
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







