హైదరాబాద్ లో ఈతకు వెళ్లి ఆరుగురు మృతి…
- November 05, 2022
హైదరాబాద్: మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. శనివారం మల్కాపురంలోని ఎర్రగుంట చెరువులో ఈతకు వెళ్లి, చెరువులో మునిగి ఆరుగురు మరణించారు. వీరిలో ఐదుగురు చిన్నారులు ఉన్నారు. మృతులను హైదరాబాద్, అంబర్పేట ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు.
వీళ్లంతా ఒక ఫంక్షన్ కోసం అంబర్పేట్ నుంచి ఇక్కడికి వచ్చినట్లు స్థానికులు చెప్పారు. సరదాగా ఈత కోసం వెళ్లి చెరువులో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఘటన సమాచారం అందుకున్న స్థానికులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. చెరువులో మునిగి మరణించిన వారి మృతదేహాల్ని వెలికితీస్తున్నారు. గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లో కురవనున్న భారీ వర్షాలు: ఎల్లో అలర్ట్ జారీ
- భూకంపంలో స్టార్ ప్లేయర్ భార్య, ఇద్దరు పిల్లలు మృతి!
- వ్యక్తి వయస్సును ఒక సంవత్సరం తగ్గించిన కోర్టు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై సౌదీ క్రౌన్ ప్రిన్స్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- అభిమానుల నిద్రవేళలను తిరగరాస్తోన్న ఫుట్ బాల్ ప్రపంచ కప్ ఫీవర్..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఫ్లైట్ టిక్కెట్ ధరల్లో భారీగా వ్యత్యాసాలు..!!
- లూసైల్ ట్రామ్ నిలిపివేతతో ప్రభావితమైన ప్రాంతాలకు కొత్త మెట్రోలింక్..!!
- జూలై 3 నుండి కువైట్లో సమ్మర్ హాటెస్ట్ సీజన్ ప్రారంభం..!!
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..







