హైదరాబాద్ లో ఈతకు వెళ్లి ఆరుగురు మృతి…
- November 05, 2022
హైదరాబాద్: మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. శనివారం మల్కాపురంలోని ఎర్రగుంట చెరువులో ఈతకు వెళ్లి, చెరువులో మునిగి ఆరుగురు మరణించారు. వీరిలో ఐదుగురు చిన్నారులు ఉన్నారు. మృతులను హైదరాబాద్, అంబర్పేట ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు.
వీళ్లంతా ఒక ఫంక్షన్ కోసం అంబర్పేట్ నుంచి ఇక్కడికి వచ్చినట్లు స్థానికులు చెప్పారు. సరదాగా ఈత కోసం వెళ్లి చెరువులో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఘటన సమాచారం అందుకున్న స్థానికులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. చెరువులో మునిగి మరణించిన వారి మృతదేహాల్ని వెలికితీస్తున్నారు. గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







