భారత రాష్ట్రపతి నుంచి నైటింగేల్‌ అవార్డు అందుకోనున్న తెలంగాణ వాసి

- November 06, 2022 , by Maagulf
భారత రాష్ట్రపతి నుంచి నైటింగేల్‌ అవార్డు అందుకోనున్న తెలంగాణ వాసి

తెలంగాణ: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం మల్లారం ఏఎన్‌ఎం ఎండీ శుక్రా ఈనెల 7న రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా నైటింగేల్‌ అవార్డు అందుకోనున్నారు.కేంద్ర ప్రభుత్వం ఏటా జాతీయస్థాయిలో విశిష్ట సేవలందించిన ఏఎన్‌ఎంలకు అందించే ఈ అవార్డుకు 2020లో శుక్రా ఎంపికయ్యారు.కొవిడ్‌ కారణంగా గతేడాది రాష్ట్రపతి కొవింద్‌ వర్చువల్‌ పద్ధతిలో అందజేశారు.అదే అవార్డును ఈనెల 7న ఢిల్లీలో ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా అందించేందుకు కేంద్రం నుంచి జిల్లా వైద్యాధికారులకు ఉత్తర్వులు వచ్చినట్లు శుక్రా పేర్కొన్నారు.ఈ మేరకు శుక్రా దంపతులు ఢిల్లీ వెళ్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com