20 వృత్తుల్లో ప్రవాసులకు ప్రొఫెషన్ పరీక్షలు
- November 06, 2022
కువైట్: ప్రవాసులకు 20 వృత్తుల్లో ప్రొఫెషన్ పరీక్షలను ఆయా దేశాల్లోని కువైట్ రాయబార కార్యాలయాల భాగస్వామ్యంతో నిర్వహించడానికి చర్యలు చేపట్టినట్లు కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్పవర్ (PAM) ప్రకటించింది. ప్రవాసులను పరీక్షించడానికి స్మార్ట్ మెకానిజంను రూపొందించే లక్ష్యంతో ప్రవాస కార్మికులను నియమించే అగ్ర వృత్తుల జాబితాను రూపొందించినట్లు అథారిటీ పేర్కొంది. రెండు విభాగాల్లో పరీక్షలు సాగుతాయని.. ప్రాక్టికల్స్ కువైట్లో ఉంటాయని, థియరిటికల్ రిక్రూట్మెంట్ ఆయా దేశాలలో ఎంబసీల సాయంతో నిర్వహించనున్నట్లు వివరించింది. కువైట్ ఇంజనీర్స్ సొసైటీ ఇంజనీరింగ్ రంగంలోని కార్మికులకు మద్దతుగా 71 వృత్తులపై నిర్వహించే వృత్తిపరమైన పరీక్షల కోసం ఒక కేంద్రాన్ని సిద్ధం చేసినట్లు తెలిపింది.
తాజా వార్తలు
- ఢిల్లీలో ప్రధాని మోదీ హైలెవల్ మీటింగ్
- మార్చి 27 వరకు యూఏఈలో భారీ వర్షాలు..!!
- హెలికాప్టర్ ప్రమాదం..ఖతార్, టర్కీలకు బహ్రెయిన్ సంతాపం..!!
- రుస్తాఖ్ భవనం కూలి నలుగురు చిన్నారులు మృతి..!!
- కువైట్ లో అక్రమంగా డ్రోన్ వినియోగం..ఆరుగురు అరెస్టు..!!
- సౌదీలో వర్షాలు..పలు ప్రాంతాలకు రెడె, ఆరెంజ్ అలెర్ట్ జారీ..!!
- రీఫండ్ ల పై ఖతార్ ఎయిర్వేస్ కీలక ప్రకటన..!!
- నో ఓటీపీ: యాప్ వెరిఫికేషన్ను ప్రారంభించనున్న యూఏఈ బ్యాంక్..!!
- వాట్సాప్కు ధీటైన స్వదేశీ యాప్!
- భవిష్యత్తు అంతా AI: సీఎం చంద్రబాబు









