గడువు ముగిసిన వస్తువుల విక్రయం.. వాణిజ్య సంస్థ సీజ్

- November 06, 2022 , by Maagulf
గడువు ముగిసిన వస్తువుల విక్రయం.. వాణిజ్య సంస్థ సీజ్

మస్కట్ : గడువు ముగిసిన వస్తువులను విక్రయిస్తున్న ఓ వాణిజ్య సంస్థను ముసండంలోని ఖాసబ్‌లోని వినియోగదారుల రక్షణ విభాగం సీజ్ చేసింది. వినియోగదారుల రక్షణ చట్టం అమలును పర్యవేక్షించేందుకు నిరంతరం తనిఖీ డ్రైవ్‌లను కొనసాగిస్తామని కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ(సీపీఏ) ప్రకటించింది. ఇందులో భాగంగానే ఖాసబ్‌లోని ఓ వాణిజ్య సంస్థలో గడువు ముగిసిన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. గడువు ముగిసిన వస్తువులను విక్రయించిన వాణిజ్య సంస్థపై జరిమానాతో పాటు చట్టపరమైన చర్యలు కూడా తీసుకున్నట్లు అథారిటీ పేర్కొంది. మార్కెట్‌లలో గడువు ముగిసిన వస్తువులను విక్రయిస్తున్నా.. నిబంధనల ఉల్లంఘనకు సంబంధించిన విషయాలను గుర్తిస్తే అధికారిక మార్గాల ద్వారా తెలపాలని వినియోగదారులకు సీపీఏ విజ్ఞప్తి చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com