మహిళకు Dh540,000 చెల్లించాలని ఆదేశించిన కోర్టు
- November 06, 2022
యూఏఈ: ఒక యువకుడు వివాహం చేసుకుంటానని ఓ మహిళ నుండి Dh 540,000 తీసుకొని మోసం చేశాడు. ఆ డబ్బుతో వివాహం అనంతరం సొంత గృహాన్ని నిర్మిస్తానని హామీ ఇచ్చి మోసానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో అరబ్ మహిళ ఆ వ్యక్తి తన నుండి తీసుకున్న Dh540,000, తన లగ్జరీ కారు అమ్మకం ద్వారా పొందిన డబ్బును తిరిగి చెల్లించాలని ఆ వ్యక్తిని ఆదేశించాలని కోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు కోర్టు ఫైల్స్ చెబుతున్నాయి. అలాగే భౌతిక, నైతిక నష్టాలకు మరో 100,000 దిర్హామ్లను కూడా ఇప్పంచాలని తన దావాలో కోరింది. సదరు వ్యక్తి తన లగ్జరీ కారును కూడా తీసుకెళ్లి విక్రయించాడని, అయితే తనకు ఆ మొత్తాన్ని ఇవ్వలేదని మహిళ తన పిటిషన్ లో పేర్కొంది. అన్ని పక్షాల వాదనలు విన్న అల్ ఐన్ కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాన్స్ కోర్టు.. మహిళ నుండి తీసుకున్న Dh540,000, నష్టపరిహారంగా మరో Dh40,000 చెల్లించాలని సదరు వ్యక్తిని ఆదేశించింది. అలాగే మహిళకు న్యాయపరమైన ఖర్చులను కూడా చెల్లించాలని తన తీర్పులో కోర్టు పేర్కొంది.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్బోర్డ్పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







