నదిలో కుప్పకూలిన విమానం.. 19 మంది దుర్మరణం!
- November 07, 2022
టాంజానియా: టాంజానియాలో ఘోర విమానం ప్రమాదం జరిగింది. విమానాశ్రయంలో ప్రయాణికుల విమానం ల్యాండ్ అవుతుండగా నదిలో కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో 19 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. ప్రెసిషన్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం బుకోబాలో ల్యాండ్ అవుతుండగా పైలట్ నియంత్రణ కోల్పోవడంతో ఎయిర్పోర్ట్ సమీపంలోని విక్టోరియా సరసులో విమానం కుప్పకూలింది.
విమానం దార్ ఎస్ సలామ్ నుంచి బుకోబా వయా మంవాంజా మీదుగా వెళ్తోంది. ప్రమాద సమాచారం అందిన వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో 19 మంది మృతి చెందినట్లు సమాచారం. మరో 26 మందిని రిలీఫ్ అండ్ రెస్క్యూ సిబ్బంది రక్షించారు. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 43 మంది ప్రయాణికులు ఉన్నారు.
కగేరా ప్రావిన్స్కు చెందిన పోలీసు కమాండర్ విలియం మ్వాంపాఘలే మాట్లాడుతూ ఘటనలో గాయపడ్డ వారిని రక్షించామని పేర్కొన్నారు. విమానం దాదాపు 100 మీటర్ల ఎత్తులో ప్రతికూల వాతావరణం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు వివరించారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- హైదరాబాద్కు 915 ఎలక్ట్రిక్ బస్సులు
- కువైట్ ఎయిర్వేస్ ప్రయాణికులకు శుభవార్త
- సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ భేటీ
- ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తే 20 శాతం డిస్కౌంట్
- పర్యాటక రంగం రాష్ట్ర ఆర్థిక ప్రగతికి గ్రోత్ ఇంజిన్: మంత్రి కందుల దుర్గేష్
- అస్సాంలో హ్యాట్రిక్ దిశగా బీజేపీ!
- చాట్జీపీటీలో పొరపాటున కూడా వీటిని సెర్చ్ చేయకండి
- ఆర్బీఐ కొత్త రూల్స్..ఏప్రిల్ 1 నుంచి మీ డబ్బు సేఫ్..
- 11 ఏళ్ల బాలుడిని కాపాడిన మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వైద్యులు
- టర్కీ విదేశాంగ మంత్రితో GCC, జోర్డాన్ రాయబారులు భేటీ..!!









