నవంబర్ 11న షార్జా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్కు షారుక్ ఖాన్!
- November 07, 2022
యూఏఈ: బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ నవంబర్ 11న షార్జా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్కు అతిథిగా హాజరుకానున్నారు. ఈ మేరకు షార్జా బుక్ అథారిటీ తమ ఇన్స్టాగ్రామ్ పేజీలో ప్రకటించింది. నవంబర్ ప్రారంభంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫాపై ఈ బాలీవుడ్ స్టార్ 57వ పుట్టినరోజును జరుపుకున్న విషయం తెలిసిందే. యూఏఈ గోల్డెన్ వీసా అందుకున్న మొదటి భారతీయ నటుడిగా షారుఖ్ ఖాన్ నిలిచాడు. అలాగే జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారిన్ అఫైర్స్ ద్వారా హ్యాపీనెస్ కార్డ్ను కూడా అందుకున్నాడు. షారూఖ్.. దుబాయ్ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. ఇప్పటికే ఈ సంవత్సరం ఈజిప్షియన్ నటుడు అహ్మద్ అల్ సక్కా, భారతీయ రచయిత దీపక్ చోప్రా, ఇటాలియన్ రచయిత్రి ఎలిసబెట్టా డామీలు షార్జా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ను సందర్శించారు.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







