నవంబర్ 11న షార్జా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్కు షారుక్ ఖాన్!
- November 07, 2022
యూఏఈ: బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ నవంబర్ 11న షార్జా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్కు అతిథిగా హాజరుకానున్నారు. ఈ మేరకు షార్జా బుక్ అథారిటీ తమ ఇన్స్టాగ్రామ్ పేజీలో ప్రకటించింది. నవంబర్ ప్రారంభంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫాపై ఈ బాలీవుడ్ స్టార్ 57వ పుట్టినరోజును జరుపుకున్న విషయం తెలిసిందే. యూఏఈ గోల్డెన్ వీసా అందుకున్న మొదటి భారతీయ నటుడిగా షారుఖ్ ఖాన్ నిలిచాడు. అలాగే జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారిన్ అఫైర్స్ ద్వారా హ్యాపీనెస్ కార్డ్ను కూడా అందుకున్నాడు. షారూఖ్.. దుబాయ్ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. ఇప్పటికే ఈ సంవత్సరం ఈజిప్షియన్ నటుడు అహ్మద్ అల్ సక్కా, భారతీయ రచయిత దీపక్ చోప్రా, ఇటాలియన్ రచయిత్రి ఎలిసబెట్టా డామీలు షార్జా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ను సందర్శించారు.
తాజా వార్తలు
- 98% మురుగునీటి శుద్ధి..పునర్వినియోగంలో అష్ఘల్ విజయం..!!
- బహ్రెయిన్ వాసులకు వీసా రహిత షెంజెన్ ప్రయాణం..జర్మనీ కృషి..!!
- అల్-అహ్మదీలో స్పెషల్ డ్రైవ్..8 దుకాణాలు సీజ్..!!
- ఒమన్ లో చేపల ధరలపై పర్యవేక్షణ బలోపేతం..!!
- సౌదీలో 385 మందిపై విచారణ, 130 మంది అరెస్టు..!!
- సోషల్ మీడియాలో సమ్మర్ ట్రావెల్ ప్లాన్స్ షేరింగ్.. అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- జూలై 8 నుంచి మారనున్న విమాన సర్వీసులు
- శంషాబాద్ ఎయిర్పోర్టులో 20 మంది మహిళలు అరెస్ట్
- ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్ ఫౌండర్ మహమ్మద్ అలీ అలబ్బర్
- ఈ లవ్ ప్రమాదకరం..ఎంపైర్ స్టేట్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్







