పాఠశాల బస్సుల్లో విద్యార్థులు మాస్కులు పెట్టుకోవాలా?
- November 08, 2022
యూఏఈ: కొవిడ్-19 ఆంక్షలను యూఏఈ ఎత్తివేసింది. అయితే, విద్యార్థులు ఇకపై బస్సుల్లో పాఠశాలలకు వెళ్లేటప్పుడు మాస్క్లు ధరించాల్సిన అవసరం ఉందా. దీనిపై అటు పేరెంట్స్, ఇటు స్కూల్స్ యాజమాన్యాల్లో అనేక సందేహాలు ఉన్నాయి. కోవిడ్ -19 పరిమితులను ఎత్తివేసిన తర్వాత.. అన్ని ఓపెన్, క్లోజ్డ్ సౌకర్యాలలో మాస్కులు ధరించడం ఆప్షనల్ గా మారింది. ఈ నిర్ణయాన్ని పాఠశాలల సంఘాలు స్వాగతిస్తున్నాయి.
అమిటీ స్కూల్ దుబాయ్ ప్రిన్సిపాల్ సంగీతా చిమా మాట్లాడుతూ.. ముందుజాగ్రత్త చర్యగా, పాఠశాల బస్సులో ప్రయాణించేటప్పుడు విద్యార్థులు మాస్క్ ధరించమని చెబుతున్నట్లు పేర్కొన్నారు. తమ విద్యార్థులలో ఎక్కువ మంది తరగతి గదిలో మాస్క్ ధరించరు. అయినప్పటికీ, మూసి ఉన్న ప్రదేశాలలో మాస్కు ధరించాలని సూచిస్తున్నామని తెలిపారు. విద్యార్థులకు సురక్షితమైన వాతావరణాన్ని అందించడమే తమ లక్ష్యమన్నారు.
క్రెడెన్స్ హైస్కూల్ సీఈఓ- ప్రిన్సిపల్ దీపికా థాపర్ సింగ్ మాట్లాడుతూ.. స్కూల్ బస్సులలో ప్రయాణించేటప్పుడు తమ విద్యార్థులు, సిబ్బంది ఇకపై మాస్క్లు ధరించాల్సిన అవసరం లేదన్నారు. అయితే, ఎవరైనా మాస్క్ ధరించాలని అనుకుంటే ఎటువంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. ఒక పిల్లవాడు జలుబు/దగ్గుతో బాధపడుతుంటే, అందరి భద్రత కోసం మాస్క్ ధరించాలని ఆమె సూచించారు.
తాజా వార్తలు
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం
- స్పీడ్ పోస్టు పేరుతో గంజాయి స్మగ్లింగ్..హైదరాబాద్లో భారీ రాకెట్ గుట్టురట్టు
- గల్ఫ్ కార్మికుడి కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సాయం
- 98% మురుగునీటి శుద్ధి..పునర్వినియోగంలో అష్ఘల్ విజయం..!!
- బహ్రెయిన్ వాసులకు వీసా రహిత షెంజెన్ ప్రయాణం..జర్మనీ కృషి..!!
- అల్-అహ్మదీలో స్పెషల్ డ్రైవ్..8 దుకాణాలు సీజ్..!!
- ఒమన్ లో చేపల ధరలపై పర్యవేక్షణ బలోపేతం..!!







