ట్రేడ్ ఇన్స్పెక్టర్పై దాడికి పాల్పడ్డ 10 మంది ప్రవాసులపై బహిష్కరణ వేటు
- November 08, 2022
ట్రేడ్ ఇన్స్పెక్టర్పై దాడికి పాల్పడ్డ 10 మంది ప్రవాసులపై బహిష్కరణ వేటు
కువైట్: ఫర్వానియా గవర్నరేట్లో ట్రేడ్ ఇన్స్పెక్టర్ల పనికి ఆటంకం కలిగించడం, దేశ చట్టాలను పాటించకపోవడం, ప్రభుత్వ ఏజెన్సీ ఉద్యోగులపై దాడి చేయడం, అగౌరవపరచడం వంటి కారణాలతో 10 మంది ఈజిప్షియన్ నిర్వాసితులను కువైట్ నుంచి బహిష్కరించారు. పోలీసుల కథనం ప్రకారం.. దజీజ్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. ఒక దుకాణంలో ఒక బహిష్కృతుడు దుకాణం లోపల ధూమపానం చేస్తూ కనిపించాడు. మూసివేసిన ప్రదేశాలలో ధూమపానం చేయడం చట్టం విరుద్ధమని MOCI ఇన్స్పెక్టర్ పొగ తాగవద్దని తెలిపారు. దీంతో కోపోద్రిక్తుడైన నిర్వాసికుడు ఇన్స్పెక్టర్ను దూషించడంతోపాటు దాడి చేశాడు. ఇతర ఈజిప్షియన్ నిర్వాసితులు అతనితో జతకలిసి ఇన్స్పెక్టర్లను తీవ్రంగా కొట్టారు. ఈ ఘటనపై వాణిజ్యం, పరిశ్రమల మంత్రి, కమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహాయ మంత్రి మజెన్ అల్ నహెద్ ఖండించారు. మంత్రిత్వ శాఖ ఉద్యోగులకు అవసరమైన సహకారం అందించి వారి పూర్తి హక్కులను పరిరక్షిస్తానని మంత్రి తెలిపారు.
తాజా వార్తలు
- జూలై 8 నుంచి మారనున్న విమాన సర్వీసులు
- శంషాబాద్ ఎయిర్పోర్టులో 20 మంది మహిళలు అరెస్ట్
- ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్ ఫౌండర్ మహమ్మద్ అలీ అలబ్బర్
- ఈ లవ్ ప్రమాదకరం..ఎంపైర్ స్టేట్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్
- ఈ నెల 20 వరకు హజ్ యాత్ర
- అరేబియా సముద్రంలో అమెరికా హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..
- ఒమన్లో అవయవ దాన సంస్కృతి ప్రోత్సహానికి అవేర్నేస్ కార్యక్రమాలు..!!
- 'బిగ్ టికెట్' ఈ-డ్రా: 1,00,000 దిర్హామ్లు గెలిచిన నలుగురు భారతీయులు..!!
- ఇరాన్ దాడుల పై ప్రశంసలు..జైలు శిక్ష ఖరారు..!!
- రియాద్ డ్రగ్ ట్రాఫికింగ్ నెట్వర్క్లో 22 మంది అరెస్ట్..!!







