ఎయిర్పోర్ట్లో బాంబ్ హెచ్చరిక..అప్రమత్తమైన సిబ్బంది
- September 28, 2025
ఈ మధ్య కాలంలో ఫేక్ కాల్స్ మరియు బెదిరింపు మెయిల్స్ ఘటనలు పెరిగాయి. రైల్వేస్టేషన్లు, స్కూల్స్, షాపింగ్ మాల్స్కి బాంబు ఉంది అని కాల్లు చేసి భయభ్రాంతి కలిగించడం సాధారణమైందని చెప్పవచ్చు. తాజాగా శంషాబాద్ ఎయిర్పోర్టుకు ఆదివారం బాంబు ఉన్నట్టు ఫేక్ మెయిల్ వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తులు ఈమెయిల్ ద్వారా బెదిరించగా, అప్రమత్తమైన ఎయిర్పోర్టు సెక్యూరిటీ సిబ్బంది వెంటనే విమానాశ్రయంలో కఠిన తనిఖీలను నిర్వహించారు. తర్వాత అధికారులు ఎయిర్పోర్టు పోలీస్స్టేషన్కు ఫిర్యాదు చేసారు. ఈ సంఘటన నేపథ్యంలో ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి ఆందోళనలో పడకూడదని సూచించారు. అలాగే ఎయిర్పోర్టులో అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై తక్షణ సమాచారం ఇవ్వాలని అధికారులు కోరారు.
ఇలాంటి ఫేక్ బెదిరింపులు దేశవ్యాప్తంగా పలు ఎయిర్పోర్ట్లలో, స్కూల్లలో, ఇతర ప్రజాసమూహ ప్రదేశాల్లో జరుగుతున్నాయి. ఢిల్లీ వంటి నగరాల్లో పాఠశాలలకు కూడా దుండగులు బెదిరింపు కాల్స్ చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు అలర్ట్ అయ్యాయి. ఫేక్ కాల్స్ ఎవరు చేస్తున్నారు, ఎటువంటి ఉద్దేశ్యంతో చేస్తున్నారన్న అంశంపై అధికారులు నిర్వహిస్తున్నారు. నిరంతరం ఈ రకమైన ఘటనలు జరుగుతున్నందున, పెద్ద సమూహాలు ఉంటే అక్కడ సిబ్బంది సురక్షితంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









