ఎయిర్పోర్ట్లో బాంబ్ హెచ్చరిక..అప్రమత్తమైన సిబ్బంది
- September 28, 2025
ఈ మధ్య కాలంలో ఫేక్ కాల్స్ మరియు బెదిరింపు మెయిల్స్ ఘటనలు పెరిగాయి. రైల్వేస్టేషన్లు, స్కూల్స్, షాపింగ్ మాల్స్కి బాంబు ఉంది అని కాల్లు చేసి భయభ్రాంతి కలిగించడం సాధారణమైందని చెప్పవచ్చు. తాజాగా శంషాబాద్ ఎయిర్పోర్టుకు ఆదివారం బాంబు ఉన్నట్టు ఫేక్ మెయిల్ వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తులు ఈమెయిల్ ద్వారా బెదిరించగా, అప్రమత్తమైన ఎయిర్పోర్టు సెక్యూరిటీ సిబ్బంది వెంటనే విమానాశ్రయంలో కఠిన తనిఖీలను నిర్వహించారు. తర్వాత అధికారులు ఎయిర్పోర్టు పోలీస్స్టేషన్కు ఫిర్యాదు చేసారు. ఈ సంఘటన నేపథ్యంలో ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి ఆందోళనలో పడకూడదని సూచించారు. అలాగే ఎయిర్పోర్టులో అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై తక్షణ సమాచారం ఇవ్వాలని అధికారులు కోరారు.
ఇలాంటి ఫేక్ బెదిరింపులు దేశవ్యాప్తంగా పలు ఎయిర్పోర్ట్లలో, స్కూల్లలో, ఇతర ప్రజాసమూహ ప్రదేశాల్లో జరుగుతున్నాయి. ఢిల్లీ వంటి నగరాల్లో పాఠశాలలకు కూడా దుండగులు బెదిరింపు కాల్స్ చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు అలర్ట్ అయ్యాయి. ఫేక్ కాల్స్ ఎవరు చేస్తున్నారు, ఎటువంటి ఉద్దేశ్యంతో చేస్తున్నారన్న అంశంపై అధికారులు నిర్వహిస్తున్నారు. నిరంతరం ఈ రకమైన ఘటనలు జరుగుతున్నందున, పెద్ద సమూహాలు ఉంటే అక్కడ సిబ్బంది సురక్షితంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- బీసీసీఐ అధ్యక్షుడిగా మిథున్ మన్హాస్
- సాయుధ పోరాటాలలో పిల్లల రక్షణకు ఖతార్ పిలుపు..!!
- ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదాన్ని త్వరగా పరిష్కరించండి..!!
- దుబాయ్ లో డ్రైవర్ లెస్ భారీ వాహనాల కోసం పైలట్ రూట్స్..!!
- హవల్లిలో అక్రమ గర్భస్రావ క్లినిక్..ప్రవాసి అరెస్టు..!!
- చట్టవిరుద్ధంగా తొలగింపు.. ఐదుగురు ఉద్యోగులకు పరిహారం..!!
- పాలస్తీనా గుర్తింపు శాశ్వత శాంతికి మార్గం: సయ్యద్ బదర్
- ఎయిర్పోర్ట్లో బాంబ్ హెచ్చరిక..అప్రమత్తమైన సిబ్బంది
- భారత్-రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతుందా?
- ఆసియా కప్ ఫైనల్లో భారత్ vs పాకిస్థాన్..