ఎయిర్పోర్ట్లో బాంబ్ హెచ్చరిక..అప్రమత్తమైన సిబ్బంది
- September 28, 2025
ఈ మధ్య కాలంలో ఫేక్ కాల్స్ మరియు బెదిరింపు మెయిల్స్ ఘటనలు పెరిగాయి. రైల్వేస్టేషన్లు, స్కూల్స్, షాపింగ్ మాల్స్కి బాంబు ఉంది అని కాల్లు చేసి భయభ్రాంతి కలిగించడం సాధారణమైందని చెప్పవచ్చు. తాజాగా శంషాబాద్ ఎయిర్పోర్టుకు ఆదివారం బాంబు ఉన్నట్టు ఫేక్ మెయిల్ వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తులు ఈమెయిల్ ద్వారా బెదిరించగా, అప్రమత్తమైన ఎయిర్పోర్టు సెక్యూరిటీ సిబ్బంది వెంటనే విమానాశ్రయంలో కఠిన తనిఖీలను నిర్వహించారు. తర్వాత అధికారులు ఎయిర్పోర్టు పోలీస్స్టేషన్కు ఫిర్యాదు చేసారు. ఈ సంఘటన నేపథ్యంలో ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి ఆందోళనలో పడకూడదని సూచించారు. అలాగే ఎయిర్పోర్టులో అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై తక్షణ సమాచారం ఇవ్వాలని అధికారులు కోరారు.
ఇలాంటి ఫేక్ బెదిరింపులు దేశవ్యాప్తంగా పలు ఎయిర్పోర్ట్లలో, స్కూల్లలో, ఇతర ప్రజాసమూహ ప్రదేశాల్లో జరుగుతున్నాయి. ఢిల్లీ వంటి నగరాల్లో పాఠశాలలకు కూడా దుండగులు బెదిరింపు కాల్స్ చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు అలర్ట్ అయ్యాయి. ఫేక్ కాల్స్ ఎవరు చేస్తున్నారు, ఎటువంటి ఉద్దేశ్యంతో చేస్తున్నారన్న అంశంపై అధికారులు నిర్వహిస్తున్నారు. నిరంతరం ఈ రకమైన ఘటనలు జరుగుతున్నందున, పెద్ద సమూహాలు ఉంటే అక్కడ సిబ్బంది సురక్షితంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!







