10 నెలల్లో 3 వేల జీతాల చెల్లింపు ఉల్లంఘనలు నమోదు
- November 10, 2022
యూఏఈ: 2022 జనవరి - అక్టోబర్ మధ్య యూఏఈలో 3 వేల జీతాల చెల్లింపు ఉల్లంఘనలు నమోదు అయినట్లు మానవ వనరులు, ఎమిరేటైజేషన్ మంత్రిత్వ శాఖ (మోహ్రే) వెల్లడించింది. యూఏఈలో వర్క్ ఇన్స్పెక్టర్లు ప్రైవేట్ రంగ సంస్థల్లో 485,000 తనిఖీలు చేపట్టారని, ఈ సందర్భంగా 26,104 కార్మిక చట్ట ఉల్లంఘనలను నమోదు చేసినట్లు తెలిపింది. చట్టాలను ఉల్లంఘించిన సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకున్నాట్లు పేర్కొన్నది. కార్మిక ఉల్లంఘనలలో వేతనాలు చెల్లించని 2,973 కేసులు నమోదయినట్లు తెలిపింది. ఈ కేసులపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేసినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అలాగే ఉద్యోగుల పాస్పోర్ట్లను యాజమాన్యాలు వెనక్కు తీసుకున్న 178 కేసుల్లో 132 పరిష్కరించబడ్డాయని తెలిపింది.
తాజా వార్తలు
- జూలై 1 నుంచి 3 వరకు భారత్లో పర్యటించనున్న జపాన్ ప్రధాని
- మాదకద్రవ్యాల పై సమగ్ర యుద్ధం ప్రకటిద్దాం: తెలంగాణ పోలీస్
- ఒమాన్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాల హెచ్చరిక..
- యూఏఈలో తప్పుడు ఎమర్జెన్సీ అలర్ట్లు..సాంకేతిక లోపమే కారణం: NCEMA
- దుబాయ్ ఆవిష్కరణల స్ఫూర్తికి ప్రతీక 'దుబాయ్-ఇట్' కార్యక్రమం
- ఏడాది చివరినాటికి అబుదాబిలో ఎయిర్ టాక్సీ సేవలు..
- ఇరాన్ విదేశాంగ మంత్రితో యూఏఈ విదేశాంగ మంత్రి అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్ సంభాషణ
- RTGS సేవల పై మంత్రి నారా లోకేశ్ ఉన్నతస్థాయి సమీక్ష
- నాగ్పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్ఫోలియోలో చేరిక
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..







