వీసా రద్దు తర్వాత 6 నెలల గ్రేస్ పీరియడ్
- November 10, 2022
యూఏఈ: రెసిడెన్సీ వీసా రద్దు తర్వాత యూఏఈ నుండి వెళ్లేందుకు గ్రేస్ పీరియడ్ ను 60 నుండి 180 రోజులకు పెంచుతూ ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్షిప్, కస్టమ్స్ మరియు పోర్ట్ సెక్యూరిటీ (ICP) నిర్ణయించింది. సాధారణంగా ప్రవాసుల వీసా రద్దు తర్వాత గ్రేస్ పీరియడ్లోగా దేశం నుండి వెళ్లాలి లేదా కొత్త వీసా పొందాల్సి ఉంటుంది.
180 రోజుల గ్రేస్ పీరియడ్ ను గోల్డెన్ వీసా హోల్డర్లు, గ్రీన్ వీసా హోల్డర్లు వారి వారి కుటుంబ సభ్యులు, వితంతువులు లేదా విడాకులు తీసుకున్నవారు, చదువు పూర్తి చేసిన విద్యార్థులు, నైపుణ్యం కలిగిన నిపుణులు (మానవ వనరుల మంత్రిత్వ శాఖ, ఎమిరేటైజేషన్ వర్గీకరణలో మొదటి, రెండవ స్థాయి) ఉన్నవారికి వర్తిస్తుంది.
90 రోజుల గ్రేస్ పీరియడ్ మాత్రం నైపుణ్యం కలిగిన నిపుణులు (మానవ వనరులు, ఎమిరటైజేషన్ వర్గీకరణ మంత్రిత్వ శాఖలో మూడవ స్థాయి), యూఏఈలో ఆస్తి యజమానులకు వర్తించనుంది. 60 రోజుల గ్రేస్ పీరియడ్ సాధారణ నివాసాల వారికి.. ఇతర వర్గాల వారికి 30 రోజుల గ్రేస్ పీరియడ్ అమల్లో ఉన్నది. అయితే, కొంతమంది నైపుణ్యం కలిగిన కార్మికులు 180 రోజుల గ్రేస్ పీరియడ్ను పొందినప్పటికీ, వారిపై ఆధారపడిన వారికి కేవలం 60 రోజుల గ్రేస్ పీరియడ్ ను మాత్రమే అమలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- జూలై 1 నుంచి 3 వరకు భారత్లో పర్యటించనున్న జపాన్ ప్రధాని
- మాదకద్రవ్యాల పై సమగ్ర యుద్ధం ప్రకటిద్దాం: తెలంగాణ పోలీస్
- ఒమాన్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాల హెచ్చరిక..
- యూఏఈలో తప్పుడు ఎమర్జెన్సీ అలర్ట్లు..సాంకేతిక లోపమే కారణం: NCEMA
- దుబాయ్ ఆవిష్కరణల స్ఫూర్తికి ప్రతీక 'దుబాయ్-ఇట్' కార్యక్రమం
- ఏడాది చివరినాటికి అబుదాబిలో ఎయిర్ టాక్సీ సేవలు..
- ఇరాన్ విదేశాంగ మంత్రితో యూఏఈ విదేశాంగ మంత్రి అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్ సంభాషణ
- RTGS సేవల పై మంత్రి నారా లోకేశ్ ఉన్నతస్థాయి సమీక్ష
- నాగ్పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్ఫోలియోలో చేరిక
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..







